Friday, June 13, 2025

తిరుమలలో భక్తుల రద్దీ..

- Advertisement -
- Advertisement -

తిరుమల స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం తిరుమల శ్రీవారిని 74,436 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇక, స్వామివారికి 27,269 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ.4.19 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. ఈరోజు(బుధవారం) తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు 9 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News