Tuesday, April 30, 2024

తిరుమల శ్రీవారి దర్శనం కోసం పోటెత్తిన భక్తులు..

- Advertisement -
- Advertisement -

తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తుతున్నారు. వేసవితోపాటు వారాంతంలో వరుస సెలవులు రావడంతో భారీగా జనాలు తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో శ్రీవారి దర్శనం కోసం 28 కంపార్ట్‎మెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతున్నట్లు టిటిడి అధికారులు తెలిపారు.

కాగా, శుక్రవారం శ్రీవారిని 71,782 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి 31,844 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.28 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News