Sunday, April 28, 2024

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..

- Advertisement -
- Advertisement -

అమరావతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. దీంతో స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో కంపార్టుమెంట్లన్నీ నిండిపోయాయి. పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి వచ్చిన నేపథ్యంలో.. స్వామి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు పేర్కొన్నారు.

కాగా, శనివారం శ్రీవారిని 83,889 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమలలో నిన్న 40,495 మంది భక్తులు నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. తిరుమలతో నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.10 కోట్లు వచ్చిందని టిటిడి అధికారులు వెల్లడించారు.

Also Read: జూన్ 26న టిటిడి గదుల కోటా విడుదల

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News