Thursday, March 28, 2024

భార్య కాపురానికి రావడం లేదని సెల్ టవర్ ఎక్కిన భర్త…. కాలు జారి

- Advertisement -
- Advertisement -

మహబూబ్‌నగర్: భార్య కాపురానికి రావడం లేదని భర్త టవర్ ఎక్కి నిరసన తెలుపుతుండగా కాలుజారి కిందపడిపోయి అతడు మృతి చెందిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. యాదయ్య అనే వ్యక్తి తన భార్య కాపురానికి రావడం లేదని సెల్ టవర్ ఎక్కాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని అతడిని కిందకు దించేందుకు ప్రయత్నించారు. సెల్ టవర్ పైనుంచి కిందకు దిగుతుండగా కాలు జారడంతో కిందపడిపోయాడు. తలకు బలమైన గాయాలు కావడంతో ఘటనా స్థలంలోనే చనిపోయాడు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మద్యం మత్తులో యాదయ్య టవర్ ఎక్కినట్టు పోలీసులు గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News