Saturday, April 20, 2024

బిర్యాని విషయంలో గొడవ.. భార్యకు నిప్పంటించిన భర్త

- Advertisement -
- Advertisement -

ఆయనవరం: చెన్నై అయనవరంలో బుధవారం దారుణం చోటుచేసుకుంది. బిర్యాని విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. అది కాస్త ముదరడంతో కోపోద్రిక్తుడైన భర్త తన భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఆమె మంటలతోనే భర్తను పట్టుకుంది. ఈ దుర్ఘటనలో భార్య మృతి అక్కడికక్కడే మృతి చెందగా, భర్త తీవ్రంగా గాయలయ్యాయి. గమనించిన స్థానికులు అతనిని సమీప ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News