Tuesday, April 16, 2024

సినిమాల్లో పెట్టుబడి పేరుతో మోసం

- Advertisement -
- Advertisement -

Hyd Police Arrested Fraud Movie Investment Gang

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లే టార్గెట్
రూ.6కోట్లు తీసుకుని ఛీటింగ్
అరెస్టు చేసిన సిసిఎస్ పోలీసులు

హైదరాబాద్: సినిమాల్లో పెట్టుబడి పెడితే భారీగా లాభాలు వస్తాయని చెప్పి పవురి వద్ద నుంచి డబ్బులు వసూలు చేసిన ముఠాను హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం…కూకట్‌పల్లికి చెందిన కొంగర అంజమ్మ చౌదరి, నాగం ఉమాశంకర్, హేమ, కొంగర సుమంత్‌పై కేసు నమోదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు అంజమ్మ చౌదరి, నాగం ఉమాశంకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. సినిమాల్లో పెట్టుబడి పెడితే భారీగా లాభాలు వస్తాయని చెప్పడంతో చాలా మంది వీరికి డబ్బులు ఇచ్చారు. ఇందులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ఎక్కువగా ఉన్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీ, డిస్ట్రిబ్యూషన్, రియల్ ఎస్టేటల్, బోర్‌వెల్స్ పలు రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నామని బాధితులకు చెప్పారు.

ఆర్‌ఆర్‌ఆర్, అలవైకుంఠపురం, లవ్ స్టోరీ, నిశ్శబ్ధం, వెంకీమామ, రాక్షసుడు, నాంది తదితర సినిమాల్లో పెట్టుబడులు పెడుతున్నామని, వాటి ద్వారా భారీగా లాభాలు వస్తాయని ఆశ చూపించారు. దాదాపుగా 30మంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, వారి బంధువుల నుంచి దాదాపుగా రూ.6 కోట్లు వసూలు చేశారు. డబ్బులు తీసుకుని చాలా రోజులు అవుతున్నా తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు నిందితులను నిలదీశారు. దీంతో అప్పటి నుంచి వారిని మంత్రులు, ఎమ్మెల్యేలు, వారి అనుచరుల పేరు చెప్పి బెదిరంచడం ప్రారంభించారు. బాధితులు హైదరాబాద్ సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అంజమ్మ చౌదరి, ఉమాశంకర్‌ను అరెస్టు చేశారు. ఈ విషయం తెలుసుకున్న బాధితులు సిసిఎస్ వద్ద పెద్ద ఎత్తున తరలివచ్చారు. తమను మోసం చేసిన వారిని కఠినంగా శిక్షించి న్యాయం చేయాలని సిసిఎస ఎదుట ఆందోళన చేశారు. ఈ కేసులో బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News