Thursday, September 18, 2025

ఏప్రిల్ 2వ తేదీ నుంచి హైదరాబాద్- అయోధ్య మధ్య నేరుగా విమాన సర్వీసులు

- Advertisement -
- Advertisement -

అయోధ్య శ్రీరామచంద్రుడి దర్శనార్థం వెళ్లే ప్రయాణీకుల కోసం ఏప్రిల్ 2 నుంచి వారానికి మూడు రోజుల చొప్పున మంగళవారం, గురువారం, శనివారం విమాన సేవలు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్, అయోధ్య మధ్యలో డైరెక్ట్ విమానం సేవలు ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 26వ తేదీన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు విమాన సేవలపై లేఖ రాశాను. ఆయన వెంటనే స్పందించి రెండు నగరాల మధ్య విమానాల రాకపోకల కోసం వాణిజ్య విమాన సంస్థలతో చర్చలు జరిపినట్లు త్వరలో ప్రారంభిస్తామని తెలిపినట్లు వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News