Wednesday, May 1, 2024

కెసిఆర్‌పై అద్దంకి ఫైర్

- Advertisement -
- Advertisement -

పొలం బాట పట్టాలని మాజి సిఎం కెసిఆర్‌కు విపక్షంలోకి వచ్చిన తర్వాత అర్ధమైందని, కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయాల కోసమే పొలం బాట పట్టిండన్నారు. జనం బాట మరచిన కెసిఆర్ ఇంకా ప్రజల ఎజెండా ఏదో తెలియని పరిస్థితిలో ఉన్నారన్నారు. మూడు నెలలకే రాజకీయాల్లో పతనం అవుతున్నామని తెలిసిన తర్వాత.. నేడు జనంలో కనపడటం చాలా విచిత్రంగా ఉందన్నారు.పదేళ్ల క్రితం మర్చిపోయిన జనాన్ని రాజకీయాల కోసం ఇప్పుడు అవసరమోచ్చారని విమర్శించారు.

అప్పుడే ఇలా చేసుంటే కెసిఆర్‌కు ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదన్నారు.గతంలో రైతులు పంట నష్టపోతే ఏనాడూ పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. కెసిఆర్ రైతల కోసం మొసలి కన్నీరు కారుస్తున్నారని అన్నారు. ఎన్నికలు, రాజకీయాలు తప్ప కెసిఆర్‌కు ఏమి తెలియదన్నారు. అసెంబ్లికి కూడా రాని కెసిఆర్ తన ఉనికి కోసమే పొలం రైతు బాట అని విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News