- Advertisement -
ముంబై: ప్రతిష్ఠాత్మకమైన ఐసిసి హాల్ ఆఫ్లో చోటు దక్కించుకున్న టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై అభినందనల వర్షం కురుస్తోంది. పలువురు మాజీ భారత ఆటగాళ్లు ధోనీని ప్రశంసలలతో ముంచెత్తారు. ధోనీ ఓ అ ద్భుతమైన క్రికెటర్. భారత్కు రెండు ప్రపంచకప్లు, ఛాంపియన్స్ ట్రోఫీ అందించిన ఘనత ధోనీకే దక్కుతోంది. అతనిలాంటి క్రికెటర్ చాలా అరుదుగా లభిస్తాడని మాజీ ఆటగా డు దినేశ్ కార్తీక్ ప్రశంసించాడు.
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నా సిర్ హుస్సేన్ కూడా ధోనిపై ప్రశంసలు కురిపించాడు. ఎం ఎస్ ధోని వేగానికి పెట్టింది పేరు. కళ్లు మూసి తెరిచేంతలో చాలా స్పీడ్గా స్టంపింగ్ చేయడంలో ధోని సిద్ధహస్తుడని కొ నియాడాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కూడా ధోనికి అభినందనలు తెలిపాడు. సౌతాఫ్రికా దిగ్గజం ఎబి డివిలియర్స్ కూడా ధోనిపై పొగడ్తల వర్షం కురిపించాడు.
- Advertisement -