Monday, June 23, 2025

చెలరేగిన బుమ్రా

- Advertisement -
- Advertisement -

తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 465/ఆలౌట్
టీమిండియాకు 6 పరుగుల స్వల్స ఆధిక్యం

లీడ్స్: టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా నిప్పులు చెరగడంతో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్ జరుగుతున్న తొలి టెస్టులో భారత్‌కు 6 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది. బుమ్రా దెబ్బకు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 465 పరుగులకు ఆలౌటైంది. ఓలీ పోప్(106) సెంచరీతో రాణించగా.. హ్యారీబ్రూ క్(99) తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. జేమీ స్మిత్(40) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో బుమ్రా(5/83) ఐదు వికెట్లు తీయగా.. ప్రసిద్ కృష్ణ మూడు వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టాడు. కాగా, తొలి ఇన్నింగ్స్‌లో భారత్ పేలవ ఫీల్డింగ్‌తో భారీ ఆధిఖ్యాన్ని చేజార్చుకుంది.భారత ఆటగాళ్లు దాదాపు ఐదు క్యాచ్‌లు నేలపాలు చేశారు. బుమ్రా వేసిన నోబాల్‌తో బ్రూక్ డకౌటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.

హ్యారీ బ్రూక్ దూకుడు..

209/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడోరోజు(ఆదివారం) ఆటను కొనసాగించిన ఇంగ్లంగ్‌కు ఆదిలోనే గట్టిషాక్ తగిలింది. సెంచరీహీరో ఓలి పోప్(106) ప్రసిధ్ కృష్ణ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. ఈక్రమంలో హ్యారీ బ్రూక్‌కకు జత కలిసిన బెన్‌స్టోక్స్ ఆచితూచి ఆడాడు. స్టోక్స్ నెమ్మదిగా ఆడినా హ్యారీ బ్రూక్ దూకుడుగా ఆడుతూ.. పరుగులు రాబట్టాడు. క్రీజులో సెట్ అయి న ఈ జోడీని సిరాజ్ విడదీసాడు. దాంతో ఐదో వికెట్‌కు నమోదైన 51 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంరతం క్రీజులోకి వచ్చిన జెమీ స్మిత్ సయితం దూకుడుగా ఆడాడు. ఈ ఇద్దరూ సిరాజ్, ప్రసిధ్ కృష్ణలను చెడుగుడు ఆడారు. ఈ క్రమంలో హ్యారీబ్రూక్ 65 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దాంతో ఇంగ్లండ్ 327/5 స్కోర్‌కు లంచ్ బ్రేక్‌కు వెళ్లింది. రెండో సెషన్‌లోనూ ఈ జోడీ దూకుడుగా బ్యాటింగ్ చేసింది. అయితే దూకుడుగా ఆడిన జేమీ స్మిత్‌ను ప్రసిధ్ పెవిలియన్ చేర్చాడు. బౌండరీ లైన్‌పై జడేజా, సాయి సుదర్శన్ అద్భుతమైన ఫీల్డింగ్‌తో క్యాచ్ ఔట్ చేశాడు. దాంతో ఆరో వికెట్‌కు నమోదైన 73 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ కాసేపటికే సెంచరీకి ఒక్క పరుగు ముంగిట హ్యారీబ్రూక్(99) క్యాచ్ ఔటయ్యాడు. ఈ పరిస్థితుల్లో క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్స్ ఆచితూచి ఆడి 8వ వికెట్‌కు 55 పరుగులు జోడించారు. కార్స్(22)ను సిరాజ్ ఔట్ చేయగా.. క్రిస్ వోక్స్‌ను బుమ్రా పెవిలియన్ చేర్చాడు. జోష్ టంగ్‌ను ఆఖరీ వికెట్‌గా పెవిలియన్ పంపాడు.

బుమ్రా నయా చరిత్ర

భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా నయా చరిత్ర సృష్టించాడు. విదేశాల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆసియా బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. సెనా(సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో 150 వికెట్లు తీసిన తొలి ఆసియా బౌలర్‌గా నిలిచాడు. ఇం గ్లండ్‌తో జరుగుతున్న లీడ్స్ టెస్టులో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో (5/83) ఐదు వికెట్లు పడగొట్టడం ద్వారా ఈ ఫీట్ సాధించాడు. ఈ క్రమం లో అతను పాకిస్థాన్ దిగ్గజ పేసర్ వసీమ్ అక్రమ్ రికార్డును అధిగమించాడు. సెనా దేశాల్లో వసీం అక్రమ్ 146 వికెట్లు తీసాడు. సెనా దేశాల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆసియా బౌలర్ల జాబితాలో బుమ్రా, వసీమ్ అక్రమ్ తర్వాత అనిల్ కుంబ్లే(141), ఇషాంత్ శర్మ(130) లు ఉన్నారు. ఇక విదేశీ గడ్డపై అత్యధిక సార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకున్న బౌలర్‌గా కపిల్ దేవ్ రికార్డ్ను బుమ్రా సమం చేశా డు. ఈ ఇద్దరూ విదేశాల్లో చెరో 12 సార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకున్నారు. ఓవరాల్‌గా బుమ్రా టెస్టుల్లో 210 వికెట్లు తీసాడు. ఇందులో 14 సార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News