Monday, April 29, 2024

“సనాతన ధర్మం” వివాదం.. ‘ఇండియా’ కూటమిపై మోడీ కీలక వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

భోపాల్ : ప్రతిపక్షాలు ఏర్పాటు చేసిన ‘ఇండియా’ కూటమి సనాతన ధర్మాన్ని అంతం చేయాలనుకుంటోందని ప్రధాని నరేంద్రమోడీ మండిపడ్డారు. గురువారం మధ్యప్రదేశ్ లోని బినాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సందర్భంగా ఆయన సనాతన ధర్మంపై విపక్షాల కూటమిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. డీఎంకే నేత తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ ‘సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి’ అంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతుండడంతో మోడీ స్పందించారు.

ప్రతిపక్షాల కూటమిని ఉద్దేశించి వారు ఇటీవల ముంబైలో ఘమండియా (దురహంకారి)కూటమిని నడిపేందుకు వ్యూహాలను సిద్ధం చేసుకొని ఉంటారని అనుకుంటున్నానని, భారత సంస్కృతిపై దాడి చేయడమే వారి వ్యూహమని మోడీ విమర్శించారు. ‘వేల ఏళ్లుగా దేశాన్ని ఏకం చేసిన భారతీయుల విశ్వాసాలు, సంప్రదాయాలపై దాడి చేయాలని వారు నిర్ణయానికొచ్చారు. లోకమాన్య తిలక్, స్వామి వివేకానంద వంటి వారికి స్ఫూర్తినిచ్చిన సనాతన

ధర్మాన్ని అంతం చేయాలనుకుంటున్నారు’అంటూ మోడీ మండిపడ్డారు. జీ20 శిఖరాగ్ర సదస్సు విజయంపై మాట్లాడుతూ ఈ విజయం 140 కోట్ల మంది భారతీయులకు చెందుతుందన్నారు. ఇది ఈ దేశ సామూహిక శక్తికి ఉదాహరణ అని చెప్పారు. ఒక దేశం లేక రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనించాలంటే ప్రభుత్వాలు పూర్తి పారదర్శకతతో వ్యవహరించాలని, అవినీతికి అడ్డుకట్ట వేయాలని చెప్పారు.

అప్పట్లో మధ్యప్రదేశ్‌ను సుదీర్ఘకాలం పాలించిన ప్రభుత్వాలు అవినీతి, నేరాలు తప్ప ఇంకేం ఇవ్వలేదని కాంగ్రెస్‌ను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు.‘ ఈ రాష్ట్ర ప్రజలను కలిసి మాట్లాడేందుకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు రూ.50 వేల కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశాం. ఈ మొత్తం కొన్ని రాష్ట్రాల బడ్జెట్ కంటే కూడా ఎక్కువ ’ అని మోడీ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News