పాకిస్థాన్, ఇండియా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ యూట్యూబ్ ఛానెల్ను భారత్ శుక్రవారం బ్లాక్ చేసింది. ‘జాతీయ భద్రత లేదా ప్రజా క్రమానికి సంబంధించిన ప్రభుత్వం నుండి వచ్చిన ఉత్తర్వు కారణంగా ఈ కంటెంట్ ప్రస్తుతం దేశంలో అందుబాటులో లేదు. ప్రభుత్వ తొలగింపు అభ్యర్థనల గురించి మరిన్ని వివరాల కోసం దయచేసి బ్లాక్ చేయబడిన ఛానెల్లో ‘గూగుల్’ పారదర్శకత నివేదికను చూడండి’ అన్న సందేశం కనబడుతోంది. భారత ప్రభుత్వం ఈ వారం మొదట్లో దాదాపు 16 పాకిస్థానీ యూట్యూబ్ ఛానెళ్లను బ్లాక్ చేసింది.
అవన్నీ తప్పుడు, రెచ్చగొట్టే, మత ఘర్షణలు రేకెత్తించే అంశాలు కలిగి ఉన్నాయని తెలిపింది. పహల్గాం దాడిపై బిబిసి రిపోర్టేజ్పై భారత్ తీవ్ర అభ్యంతరాన్ని కూడా వ్యక్తంమ చేసింది. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సిఫార్సుల మేరకు వాటిని బ్లాక్ చేశారు. బ్లాక్ అయిన యూట్యూబ్ సైట్లలో డాన్ న్యూస్, ఇర్షాద్ భట్టీ, సమా టివి, ఎఆర్వై న్యూస్, బోల్ న్యూస్, రఫ్తార్, ది పాకిస్థాన్ రిఫరెన్స్, జియో న్యూస్, సమా స్పోర్ట్, జిఎన్ఎన్, ఉజైర్ క్రికెట్, ఉమర్ చీమా ఎక్స్క్లూజివ్, ఆస్మా షిరాజీ, మునీమ్ ఫారూఖ్, సునో న్యూస్, రాజీ నామా వంటివి ఉన్నాయి.