Saturday, May 4, 2024

మళ్లీ మోడీ గెలిస్తే దేశం సర్వనాశనం: దీపాదాస్ మున్షీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మళ్లీ ప్రధాని నరేంద్ర మోడీ గెలిస్తే దేశం సర్వనాశనం అవుతోందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దీపాదాస్ మున్షీ తెలిపారు. హామీలన్నీ మోడీ ప్రభుత్వం విస్మరించిందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యం ఉండాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. పదేండ్ల మోసం, వందేళ్ల విధ్వంసం పేరుతో బిజెపి పాలనపై కాంగ్రెస్ ప్రజా ఛార్జీషీట్ విడుదల చేసింది ఈ సందర్భంగా దీపాదాస్ మున్షీ మాట్లాడారు. బిజెపి పాలనలో ధరలు, నిరుద్యోగం పెరిగిందని మండిపడ్డారు. కాంగ్రెస్ జోడో యాత్ర చేస్తుంటే బిజెపి విద్వేసం పెంచుతోందని, పదేళ్లుగా ప్రజాస్వామ్యంపై బిజెపి దాడులు చేస్తోందని ఆమె దుయ్యబట్టారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ నినాదం అమలు కావటంలేదని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో సిఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భటి విక్రమార్క, మంత్రులు, పలువురు ఎంఎల్‌ఎలు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News