Friday, April 26, 2024

రక్షణ రంగంలో భారత్ బలోపేతమైంది: మోడీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రక్షణ రంగంలో భారత్ బలోపేతమైందని ప్రధాని మోడీ తెలిపారు. బెంగళూరు వేదికగా ఏరో ఇండియా ప్రదర్శన జరిగింది. ఈ నెల 17 వరకు బెంగళూరు ఏరో ఇండియా షో నిర్వహించనున్నారు. ఎయిర్‌షోను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. అనంతరం మోడీ మాట్లాడారు. వివిధ దేశాల రక్షణ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. తక్కువ ఖర్చుతోనే రక్షణ పరికరాలను మనం తయారు చేస్తున్నామని, విదేశాలకు రక్షణరంగ సామాగ్రి ఎగుమతి చేసే దేశంగా మారాలన్నారు.

ఆత్మనిర్భర్ భారత్ ద్వారా ఇక్కడే విమానాలు తయారు చేసుకుంటున్నామని, విదేశాలకు ఎగుమతి చేసే రక్షణ సామాగ్రిని ఆరు రెట్లు పెంచామన్నారు. రక్షణరంగంలో పెట్టుబడులు పెట్టాలని ప్రైవేటు సంస్థలను కోరుతున్నామని మోడీ వివరించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఎన్నో కొత్త పుంతలు తొక్కామని, కేంద్ర బడ్జెట్‌లో వస్తువుల తయారీ పరిశ్రమలకు పెద్దపీట వేశామని స్పష్టం చేశారు. భారతీయ రక్షణ రంగంలో పెట్టుబడులకు నిబంధనలు సరళతరం చేశామని,

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News