Saturday, July 27, 2024

2030 నాటికి 10 ట్రిలియన్ డాలర్లకు..

- Advertisement -
- Advertisement -

వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ప్రెసిడెంట్ బోర్గే బ్రెండే

రాబోయే సంవత్సరాల్లో భారతదేశం 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దశలో ఉంది, త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ప్రెసిడెంట్ బోర్గే బ్రెండే పేర్కొన్నారు. ఆయన ఒక మీడియా సంస్థ ఇంటర్వూలో మాట్లాడుతూ, భారతదేశం 10 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మారే మార్గంలో ఉందని అన్నారు. ప్రపంచంలోని అన్ని ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో భారత్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతోందన్నారు.

దావోస్‌లో జరిగిన ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమావేశంలో భారత్‌పై చాలా ఆసక్తిని చూశామని, భవిష్యత్తులో కూడా ఇది కొనసాగుతుందని భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ‘భారతదేశానికి వచ్చినప్పుడల్లా మీరు ప్రపంచంలోని ప్రతిచోటా అనుభూతి చెందని ఆశతో నిండి ఉంటారు. ప్రస్తుతం భౌగోళిక రాజకీయ మాంద్యం, అనిశ్చితి ప్రపంచాన్ని చూస్తున్నాం. అయితే సహకరించగల ప్రాంతాలు ఇంకా ఉన్నాయని, ఆ ప్రాంతాలను అన్వేషించడం చాలా ముఖ్యం’ అని ఆయన అన్నారు. భారత్ 7 శాతం చొప్పున ఆర్థికంగా వృద్ధిని సాధిస్తోందని, ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికా కూడా మెరుగైన పనితీరును కనబరుస్తోందని బోర్గే బ్రెండే అన్నారు.

వచ్చే రెండు, మూడేళ్లలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలన్న భారత్ లక్ష్యంపై బోర్గే బ్రెండే స్పందిస్తూ, రానున్న సంవత్సరాల్లో భారత్ 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారే మార్గంలో ఉందన్నారు. భారతదేశం ముఖ్యమైన సంస్కరణల ద్వారా ముందుకు సాగిందని ఆయన అన్నారు. రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనాలతో పోలిస్తే భారత్ మెరుగైన స్థితిలో ఉంది. భారతదేశంలో విదేశీ పెట్టుబడులలో నిరంతర పెరుగుదల కనిపిస్తోంది, ఇతర దేశాలలో గతంలో కనిపించిన తయారీ కార్యకలాపాలు పెరుగుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News