Friday, April 26, 2024

దేశంలో కొత్తగా 16వేల పాజిటీవ్ కేసులు..

- Advertisement -
- Advertisement -

India Reports 16103 New Corona Cases in 24 hrs

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 16,103 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. తాజా కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4.35కోట్లు దాటాయి. నిన్న కరోనాతో 31మంది బాధితులు ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటివరకు దేశంలో 5,25,199మంది మృతి చెందారు. గత 24 గంటల్లో 13,929 బాధితులు డిశ్చార్జీ కాగా, ఇప్పటివరకు మొత్తం 4,28,65,519మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,11,711 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, రోజువారీ పాజిటివిటీ రేటు 1.21శాతం, రికవరీ రేటు 98.54 శాతంగా ఉందని ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటివరకు 197.95 కోట్లకు పైగా కరోనా టీకాలను పంపిణీ చేశామని పేర్కొంది.

India Reports 16103 New Corona Cases in 24 hrs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News