Thursday, April 25, 2024

దేశంలో కొత్తగా 18వేల కరోనా కేసులు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశంలో మళ్లీ కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 18,738 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనాతో మరో 40మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4.40కోట్లకు చేరుకుంది. ఇప్పటివరకు దేశంలో 5,26,689 మంది మరణించారు. ఇక, కరోనా నుంచి గత 24 గంటల్లో 18,558 మంది కోలుకోగా.. ఇప్పటివరకు 4,34,84,110 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,34,933 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 205.21 కోట్లకుపైగా కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని ఆరోగ్య శాఖ తెలిపింది.

India Reports 18738 new corona cases in 24 hrs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News