Wednesday, April 24, 2024

దేశంలో కొత్తగా వెయ్యి లోపే కరోనా కేసులు..

- Advertisement -
- Advertisement -

India Reports 862 new corona cases in 24 hrs

న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటీవ్ కేసులు రోజురోజుకు తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 862 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. 196 రోజుల తర్వాత కొత్త కేసులు వెయ్యిలోపే నమోదయ్యాయి. తాజా కేసులతో దేశవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 4.46కోట్లకు చేరింది. గత 24 గంటల్లో కరోనా కారణంగా ముగ్గురు మృతి చెందగా, 1,503 మంది కరోనా వైరస్‌ నుంచి కోలుకున్నారు. దీంతో దేశంలో కరోనాతో ఇప్పటివరకు 5,28,980మంది బాధితులు మరణించగా.. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా నుంచి 4.40కోట్లకు పైగా బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 22,549 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక, మొత్తం కేసుల్లో 0.05 శాతం కేసులు యాక్టివ్‌గా ఉండగా, రికవరీ రేటు 98.76 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 219.56 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది.

India Reports 862 new corona cases in 24 hrs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News