Sunday, April 28, 2024

కెనడాలో విమానం కూలి భారతీయ ట్రైనీ పైలట్లు మృతి

- Advertisement -
- Advertisement -

ఒట్టావా:  కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లో శనివారం జరిగిన విమాన ప్రమాదంలో ఇద్దరు భారతీయ ట్రైనీ పైలట్లు మరణించినట్లు అధికారులు తెలిపారు. పైలట్లు అభయ్ గాడ్రూ, యశ్ విజయ్ రాముగాడే. ట్రైనీ పైలట్‌లిద్దరూ ముంబై వాసులు. పైపర్ పీఏ-34 సెనెకా అనే ట్విన్ ఇంజన్‌తో కూడిన తేలికపాటి విమానం చిల్లివాక్ నగరంలోని ఓ మోటెల్ వెనుక ఉన్న చెట్లు పొదలపై కూలిపోయిందని కెనడా పోలీసు అధికారులు తెలిపారు.

ఈ ఘటనలో భారతీయులే కాకుండా మరో పైలట్ కూడా చనిపోయాడు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ప్రజలకు ఎటువంటి ఇతర గాయాలు కాలేదని కెనడియన్ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. విమాన ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదు. కెనడా రవాణా భద్రతా బోర్డు ఈ సంఘటనపై దర్యాప్తు ప్రారంభించిందని అధికారులు వెల్లడించారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News