Thursday, May 2, 2024

ఆసియాకప్ కు భారత జట్టు ప్రకటన..

- Advertisement -
- Advertisement -

ఆసియా కప్ 2023కు బిసిసిఐ భారత జట్టును ప్రకటించింది. హిట్ మాన్ రోహిత్ శర్మ సారధ్యంలోని 17మంది సభ్యులతో కూడిన జట్టును బిసిసిఐ తాజాగా ప్రకటించింది. హైదరాబాదీ క్రికెటర్ తిలక్ వర్మకు ఆసియా కప్ జట్టులో చోటు కల్పించారు. గాయాల కారణంగా జట్టుకు దూరమైన కెఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ లను తిరిగి జట్టులోకి తీసుకున్నారు. కాగా, ఆసియా కప్ ఈనెల 30 నుంచి ప్రారంభం కానుంది.

ఆసియాకప్ జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, హర్ధిక్ పాండ్యా(వైస్ కెప్టెన్), సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ, జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, శార్దుల్ ఠాకూర్, మహ్మద్ షమీ, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ.

స్టాండ్ బై ప్లేయర్: సంజూ శాంసన్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News