Wednesday, April 30, 2025

మంత్రి ఎర్రబెల్లి వాహనం తనిఖీ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కాన్వాయ్‌ని మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణం పాల కేంద్రం కూడలి వద్ద పోలీసులు తనిఖీ చేశారు. ఎన్నికల నిబంధనలను అనుసరించి పోలీసులకు మంత్రి ఎర్రబెల్లి పూర్తిగా సహకరించారు.

మంత్రి వాహనంతో పాటు ఆయన వెంట ఉన్న ఇతర వాహనాలను సైతం పోలీసులు తనిఖీ చేశారు. వెంట ఏమైనా డబ్బు ఉందా? ఎంత ఉంది? అంటూ ఆరా తీశారు. వాహన పరిశీలన తర్వాత తమకు సహకరించిన మంత్రికి పోలీసులు ధన్యవాదాలు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News