Tuesday, April 30, 2024

బెంగళూరుపై సన్‌రైజర్స్ ఉత్కంఠ విజయం

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : పరుగుల సునామీ పారిన ఉత్కంఠ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 25 పరగుల తేడాతో గెలుపొందింది. సోమవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో చిన్నస్వామి స్టేడియం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 288 పరుగుల భారీ స్కోర్ బాదింది. ట్రావిస్ హెడ్ 102 (41 బంతుల్లో 9×4, 8×6) సెంచరీతో విజృంభించగా అతనికి తోడు హెన్రీచ్ క్లాసెన్ 67 (31 బంతుల్లో 2×4, 7×6), ఎయిడెన్ మార్క్మ్ 32 (17 బంతుల్లో 2×4, 2×6 ), అబ్దుల్ సమద్ 37 (10 బంతుల్లో 4×4, 3×6) మెరుపులు మెరిపించడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 287 పరుగులు చేసింది.

అనంతరం బ్యాటింగ్ దిగిన బెంగళూరు ధీటైన జవాబునే ఇచ్చింది. విరాట్ కోహ్లీ (42), డూప్లెసిస్(62)లు శుభారంభాన్ని అందించినా మిగతా బ్యాటర్లు రాణించకపోయారు. మిడిలార్డర్‌లో వచ్చిన దినేశ్ కార్తీక్(83) కాసేపు మెరినా ఫలితం దక్కిలేదు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో బెంగళూరు ఏడు వికెట్లు కోల్పోయి 262 పరుగులు మాత్రమే చేసింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ మరో ఆల్‌టైమ్ రికార్డ్‌ను నమోదు చేసింది. టి20 క్రికెట్ చరిత్రలోనే అత్యంత భారీ స్కోర్ రికార్డ్ తన పేరిటే ఉండగా దానిని బద్దలు కొట్టింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News