Friday, June 6, 2025

అంబరాన్నంటిన ఐపిఎల్ ముగింపు వేడుకలు

- Advertisement -
- Advertisement -

దేశభక్తి గీతాలతో ఉర్రూతలూగించిన
శంకర్ మహదేవన్ బృందం
వందేమాతరం నినాదంతో
ప్రతిధ్వనించిన స్టేడియం
అహ్మదాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) సీజ న్ 2025 ముగింపోత్సవ వేడుకలు మంగళవారం ఘనం గా జరిగాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం లో జరిగిన ఈ వేడుకల్లో దేశభక్తి ఏరులై ప్రవాహించింది. వందేమాతరం నినాదంతో నరేంద్ర మోడి క్రీడా ప్రాంగ ణం మారుమ్రోగి పోయింది. ప్రముఖ సంగీతకారుడు శం కర్ మహాదేవన్ నేతృత్వంలోని గాయకులు దేశభక్తి గీతాలతో అభిమానులను కనువిందు చేశారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత సైనికులు శత్రు దేశం పాకిస్థాన్‌కు ఆపరేషన్ సిందూర్‌తో గట్టి సమాధానం ఇచ్చిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా త్రివిద దళాలకు ధన్యవాదాలు తెలుపుతూ భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) ఐపిఎల్ ము గింపు వేడుకల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ సంగీత దర్శకుడు శంకర్ మహాదేవన్ బృందం దేశభక్తి పాటలతో అలరించారు. శంకర్ మహాదేవన్‌తో సహా వేదికపై ఉన్న కళాకారులందరూ జై హింద్, భారత్ మాతా కి జై నినాదాలు చేశా రు. భారత జాతీయ గీతం వందేమాతరం పాడినప్పుడు మైదానంలోఉన్న వేలాది మంది అభిమానులు ఆయనతో లయ కలిపారు.దీంతో నరేంద్ర మోడీ స్టేడియం మొత్తం దేశభక్తితో మునిగిపోయింది.

IPL 2025 Ending

మంగళవారం అహ్మదాబాద్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ మధ్య ఫైనల్ పోరు జరిగింది. ఈ మ్యాచ్ ఆరంభానికి ముందు ముగింపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాగా, ఈ వేడుకల్లో శంకర్ మహాదేవన్ బృందం అలపించిన‘తేరిమిట్టి మే మిల్ జావా’ వతన్ పర్ సర్ కటానే సే నహి డర్‌తే, జై హో, కహ్‌తే హై హమ్‌కో ప్యార్ సే ఇండియా వాలే పాటలు అభిమానులను కట్టి పడేశాయి. ఈ సందర్భంగా కళాకారులందరూ తెల్లటి దుస్తులు ధరించి, దానిపై త్రివర్ణ దుపట్టాను ధరించారు. ఇక కళాకారుల అద్భుత ప్రదర్శనకు స్టేడియంలో ఉన్న లక్షమంది అభిమానులు ఆనందంలో మునిగి పోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News