Wednesday, July 16, 2025

గాజా మసీదుపై, పాఠశాలపై ఇజ్రాయెల్ దాడి

- Advertisement -
- Advertisement -

24 మంది మృతి, 93 మందికి గాయాలు

గాజా పట్టీలో ఆదివారం ఉదయం ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడులలో కనీసం 24 మంది చనిపోగా, 93 మందికి గాయాలయ్యాయి. ఇజ్రాయెల్ డీర్ అల్-బలాహ్ లోని ఇబ్న్ రష్ద్ పాఠశాలను, షుహాదా అల్-అక్సా మ సీదును లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిపింది. గాజాలో హమాస్ ఉగ్రవాద సంస్థ ప్రభుత్వాన్ని నడుపుతోంది.

ఇదిలావుండగా వేలాది మంది పలస్తీనా అనుకూల నిరసనకారులు యూరొప్ లోని వివిధ నగరాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. పెద్దపెద్ద ర్యాలీలు చేపట్టారు. లండన్ డౌనింగ్ స్ట్రీట్ లోనైతే వేలాది మంది నిరసనకారులు భారీ పోలీసు బందోబస్తు ఉన్నప్పటికీ మార్చ్ నిర్వహించారు. చాలా మంది పలస్తీనా జెండా పట్టుకుని నిరసనలు చేశారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News