Monday, April 29, 2024

తెలంగాణపై విషం చిమ్ముతున్న మోడీ: జగదీష్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

 

మన తెలంగాణ/సూర్యాపేట: ఫ్యూడల్ విధానంతో దేశాన్ని పాలిస్తున్న ప్రధాని మోడీకి తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేటలో ఆయన మాట్లాడారు. పేద ప్రజలకు, అన్నదాతలకు ఇస్తున్న సబ్సిడీ లను రద్దు చేయాలని చూస్తున్న మోడీకి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. వ్యవసాయాన్ని, అన్నదాతలను కాపాడేందుకు ముఖ్యమంత్రి ఉచిత విద్యుత్ ని ఇస్తున్నారని, మోటర్లకు మీటర్లు పెట్టె ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

అభివృద్ధి చెందుతున్న తెలంగాణపై మోడీ విషం చిమ్ముతున్నారని, దేశ సంపాదనను కార్పొరేట్ శక్తులకు దోచి పెడుతున్న మోడీకి రోజులు దగ్గర పడ్డాయన్నారు. దేశప్రజలను జాగృతం చేసేందుకే సిఎం కెసిఆర్ బిఆర్ఎస్ పార్టీని స్థాపించారని, ఉధృతమైన పోరాటాలు చేసి, దేశానికి పట్టిన బిజెపి పీడను వదిలిస్తామన్నారు. బిజెపి పాలనలో దేశం తిరోగమనం అయిందని, దేశాన్ని బ్రష్టు పట్టించిన బిజెపోళ్లను వదిలిపెట్టొద్దన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News