- Advertisement -
హైదరాబాద్: వేర్వేరు విద్యుత్ ప్రమాదాల్లో నలుగురు మృతి చెందిన సంఘట జగిత్యాల, రంగారెడ్డి జిల్లాలో జరిగింది. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలో బాలాజీ వినాయక విగ్రహాల తయారీ కేంద్రంలో విగ్రహాలను పక్క షెడ్ లోకి తీసుకెళ్తుండగా హై టెన్షన్ వైర్లు తగలడంతో ఇద్దరు దుర్మరణం చెందగా ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.
రంగారెడ్డి జిల్లా ఎల్బి నగర్ ప్రాంతం చింతలకుంట సమీపంలో హైటెన్షన్ విద్యుత్ తీగలు తెడిపడడంతో ఇద్దరు చనిపోయారు. రోడ్డు పక్కన పుట్పాత్పై నిద్రపోతున్న వారిపై తీగలు పడడంతో యాచకులు మరణించారు. పోలీసులు ఘటనా స్థలానినికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
- Advertisement -