Thursday, April 18, 2024

టాలీవుడ్ ఎంట్రీ ఓకేనా?

- Advertisement -
- Advertisement -

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ గురించి దాదాపుగా రెండేళ్ల నుంచీ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఫలానా సినిమాలో తననే హీరోయిన్‌గా తీసుకున్నారని, ఈసారి జాన్వీ తెలుగు సినిమా చేయడం ఖాయమని రకరకాల వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే జాన్వీ మాత్రం తెలుగు తెరపై కనిపించలేదు. ఈ యంగ్ బ్యూటీ పారితోషికం ఎక్కువగా డిమాండ్ చేస్తోందని, అసలు తనకు తెలుగులో సినిమాలు చేయడం ఇష్టం లేదని, తన దృష్టంతా బాలీవుడ్‌పైనే అని కూడా చెప్పుకున్నారు. అయితే ఎట్టకేలకు జాన్వీ ఎంట్రీ ఖాయమైంది.

ఎన్టీఆర్ సినిమాతో ఈ బ్యూటీ తెలుగులో అరంగేట్రం చేయబోతోంది. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కథానాయికగా జాన్వీ ఎంట్రీ దాదాపుగా ఖరారైంది. ఇటీవల ముంబయ్‌లో జాన్వీ, కొరటాల మధ్య చర్చలు జరిగినట్టు… ఈ యంగ్ బ్యూటీ ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నట్టు సమాచారం. ఈ నెలాఖరున ఎన్టీఆర్ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. జాన్వీ కూడా అతి త్వరలోనే సెట్లో అడుగు పెట్టనుందని తెలిసింది. కొద్ది రోజుల్లోనే జాన్వీ ఎంపిక గురించి అధికారిక ప్రకటన రావచ్చని సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News