రాష్ట్రంలో జూనియర్ డాక్టర్లు తమ సమ్మెను విరమించారు. ప్రభుత్వంతో వారు జరిపిన చర్చలు సఫలం అయిన నేపథ్యంలో సోమవారం నుంచి తలపెట్టిన సమ్మెను విరమిస్తున్నామని జూడాలు ప్రకటించారు. తమ సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని లేదంటే జూన్ 30 నుంచి ధర్నాకు దిగుతామని జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి ఇటీవల సమ్మె నోటీసు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ జూడాలను ఆదివారం చర్చలకు ఆహ్వానించారు. చర్చలకు ముందే ప్రభుత్వం మెడికోలకు భారీగా స్టైఫండ్ పెంచుతూ ఉత్తర్వులు విడుదల చేసింది. అలాగే కాలేజీల్లో, అనుబంధ ఆసుపత్రుల్లో మౌలిక సదూపాయాలు పెంచుతామని హామీ ఇచ్చింది. ఈ క్రమంలో ప్రభుత్వంతో తమ చర్చలు సఫలం అయ్యాయని జూడాలు పేర్కొన్నారు. మెడికోలకు భారీగా స్టైఫండ్ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో జూడాలు మంత్రి దామోదర రాజనరసింహకు కృతజ్ఞతలు తెలిపారు.
జూనియర్ డాక్టర్లు సమ్మె విరమణ
- Advertisement -
- Advertisement -
- Advertisement -