Tuesday, June 17, 2025

సమ్మె విరమించిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె విరమించారు. సమ్మె విరమిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్ ప్రకటించారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు గత 16 రోజులుగా సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇచ్చిన భరోసాతోనే సమ్మె విరమిస్తున్నామని శ్రీకాంత్ గౌడ్ పేర్కొన్నారు. తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించడంతో పాటు పలు డిమాండ్లు నెరవేర్చాలని ఏప్రిల్ 28 నుంచి సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే.

Also Read: కార్మికుల రక్షకుడు అంబేడ్కర్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News