Tuesday, April 30, 2024

జైలుకు పోతే పోతా: మాజీ మంత్రి ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తనను ఇరికించేందుకు కుట్ర పన్నుతున్నారని ఎర్రబెల్లి వెల్లడించారు. జైలుకు పోతే పోతా.. కానీ పార్టీ మారను అని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. గతంలో రైతుల కోసం పోలీసులతో దెబ్బలు తిని మూడు సార్లు జైలుకు వెళ్లి వచ్చానని గుర్తుచేశారు. హామీల అమలు అడిగితే కేసులతో భయపెడుతున్నారని ఆయన ఆరోపించారు. బిఆర్ఎస్ పార్టీని టిఆర్ఎస్ గా మార్చే ఆలోచన చేస్తున్నామని ఎర్రబెల్లి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News