Thursday, May 16, 2024

బిఆర్ఎస్ ఎక్కడా గెలువదు: తీన్మార్ మల్లన్న

- Advertisement -
- Advertisement -

వరంగల్: పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ఎక్కడా గెలిచే పరిస్థితి లేదని ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల పట్టభద్రుల కాంగ్రెస్ ఎంఎల్ సి అభ్యర్థి తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్) అన్నారు. వరంగల్ లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్య చేశారు. బిజెపి మెప్పు పొందేందుకు అన్ని స్థానాల్లో కెసిఆర్ డమ్మీ అభ్యర్థులను నియమించారన్నారు. ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తే 50 శాతం బిసిలకు రిజర్వేషన్ ఇస్తుందని తెలిపారు. బిజెపికి ఓటేస్తే ‘వన్ నేషన్ కాదు…జీరో ఎలక్షన్ అవుతుంది’ అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News