Saturday, July 27, 2024

రైతుల పక్షాన జంగ్ సైరన్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి మోసం చేసిన రాష్ట్ర ప్రభు త్వ రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా గురువారం రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేం ద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ కార్యకర్తలకు బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ పిలుపునిచ్చారు. పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తెల్లారే వరి ధాన్యానికి క్వింటాలు కు 500 రూపాయల బోనస్ చెల్లిస్తానని ప్ర కటించిన కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి..ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి వంచించడం,మోసం చేయడం, దగా చేయడమేనని కెసిఆర్ దుయ్యబట్టారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ రైతువ్యతిరేక విధానాలను ఈ సందర్భంగా అధినేత కెసిఆర్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ..రాష్ట్రంలో 90 శాతం రైతులు దొడ్డు వడ్లనే పండిస్తారని, ఈ

విషయం తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా ఎట్లా ప్రకటిస్తదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం ద్వారా తెలంగాణ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి వంచించిందని విమర్శించారు. ఓట్లు డబ్బాలో పడంగనే కాంగ్రెస్ వాళ్లకు రైతుల అవసరం తీరిందని, అందుకే నాలిక మల్లేసి ఎప్పటి మాదిరిగానే నయవంచనకు పూనుకున్నారని మండిపడ్డారు. ఇదే సన్న వడ్లకు మాత్రమే అనే మాట ఎన్నికలకు ముందు గనుక చెప్పి ఉంటే కాంగ్రెస్ పార్టీని రైతులు తుక్కు తుక్కు చేసేవాళ్లు అని, ఇప్పటికీ ప్రజలు ఆగ్రహంతోనే ఉన్నారని పేర్కొన్నారు. రైతుబంధు ఇయ్యక, రైతు భరోసా ఇయ్యకుండా రైతాంగాన్ని అన్నిరకాలుగా కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తున్నదని, ఆ కారణంగానే రైతాంగ హక్కులను, హామీలను సాధించేందుకే బిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపట్టిందని కెసిఆర్ స్పష్టం చేశారు.

కార్యకర్తలు రైతులపక్షాన నిలబడి కొట్లాడాలి
బిఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు రైతులపక్షాన నిలబడి కొట్లాడాలని పార్టీ అధినేత కెసిఆర్ పిలుపునిచ్చారు. ఇప్పటికీ కొనుగోలు కేంద్రాల్లో వడ్లను కొనడానికి నిర్లక్ష్యం వహిస్తూ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ఏడిపిస్తూ గోస పుచ్చుకుంటున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర రైతాంగానికి భరోసా కల్పించేదిశగా నిరసన కార్యక్రమాలతో పాటు ప్రతిరోజూ వడ్ల కల్లాలకాడికి బిఆర్‌ఎస్ శ్రేణులు పోవాలని, రైతులకు అండగా నిలవాలని కెసిఆర్ పిలుపునిచ్చారు. రైతుల హక్కులను కాపాడేందుకు వారికి అండగా నిలిచేందుకు బిఆర్‌ఎస్ పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ పునరుద్ఘటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News