Saturday, July 27, 2024

లోక్ సభ ఎన్నికలకు మండి నుంచి నామినేషన్ దాఖలు చేసిన కంగనా రనౌత్

- Advertisement -
- Advertisement -

సిమ్లా:  నటి, బిజెపి అభ్యర్థి కంగనా రనౌత్ మంగళవారం లోక్‌సభ ఎన్నికలకు హిమాచల్ ప్రదేశ్ లోని మండి స్థానం నుంచి నామినేషన్‌ దాఖలు చేశారు.  కంగనాతో పాటు ఆమె తల్లి ఆశా రనౌత్, సోదరి రంగోలి చందేల్ ఉన్నారు. కాగా కంగనా ఆకుపచ్చ చీరలో, హిమాచలీ క్యాప్‌ పెట్టుకుని కనిపించారు.

నామినేషన్ దాఖలు చేశాక కంగనా రనౌత్ ‘‘ఈరోజు నేను ‘మండి’ నియోజకవర్గం నుంచి నామినేషన్‌ దాఖలు చేశాను. మండి నుంచి పోటీ చేసే అవకాశం రావడం గర్వించదగ్గ విషయం… బాలీవుడ్‌లో విజయం సాధించిన నేను రాజకీయ రంగంలో విజయం సాధిస్తాననే ఆశాభావంతో ఉన్నాను’’ అన్నారు.

Kangana 2

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News