Wednesday, June 4, 2025

బిఆర్ఎస్ ఒంటరిగానే అధికారంలోకి వస్తుంది: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అబద్ధాలు చెప్పడంలో తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి అగ్రగామి అని మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) విమర్శించారు. అభివృద్ధిలో మాజీ సిఎం కెసిఆర్ అగ్రగామి అని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..బిఆర్ఎస్ ఒంటరిగానే అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. రేవంత్ రెడ్డి (Revanth Reddy) అందాల పోటీలపై రివ్యూ చేశారు తప్ప..రైతుల ధాన్యంపై మాత్రం రివ్యూ చేయలేదని ఎద్దేవా చేశారు. రేవంత్ రూ.21 వేల కోట్ల వడ్డీలేని రుణాలు..మహిళలకు ఇచ్చినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. కెసిఆర్ ఆనవాళ్లను ఎవరూ చెరిపివేయలేరని పేర్కొన్నారు.

రైతుబంధు, రైతుబీమా ఎగ్గొట్టారని, రుణమాఫీ కొంతే చేశారని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి ఒక్క ప్రాజెక్టు కట్టారా? ఒక్క చెరువు తవ్వారా? అని హరీష్ రావు ప్రశ్నించారు. బిజెపిలో బిఆర్ఎస్ కలుస్తుందని కొందరు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బిఆర్ఎస్ పార్టీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని, మాజీ సిఎం కెసిఆర్ మొన్ననే కుండబద్దలు కొట్టి చెప్పారని తెలియజేశారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా బిఆర్ఎస్ కు వంద సీట్లు ఖాయం అని హరీష్ రావు స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News