Tuesday, April 30, 2024

కెసిఆర్ కు శస్త్ర చికిత్స విజయవంతం

- Advertisement -
- Advertisement -

తుంటి ఎముక మార్పిడి చేసిన యశోద వైద్యుల బృందం

8 వారాల్లో పూర్తిగా కోలుకుంటారు : యశోద వైద్యులు గురువారం అర్ధరాత్రి వ్యవసాయ క్షేత్రంలోని
నివాసంలో జారిపడ్డ మాజీ సిఎం

కెసిఆర్‌కు గాయం కావడం బాధాకరం.. త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా : ప్రధాని మోడీ

మెరుగైన చికిత్సకు సిఎం రేవంత్ ఆదేశం
కెటిఆర్‌కు ఎపి సిఎం జగన్ ఫోన్
బిఆర్‌ఎస్ నేతలు, ప్రముఖుల పరామర్శ

యశోదకు పోటెత్తిన అభిమానులు

చికిత్సపై సతీమణి శోభ, కెటిఆర్, కవిత, హరీశ్ నిరంతర పర్యవేక్షణ

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ మాజీ సిఎం, బిఆర్‌ఎస్ అధ్యక్షుడు కెసిఆర్‌కు సర్జరీ సక్సెస్ అయింది. సోమాజీగూడలోని యశోద హాస్పిట ల్ వైద్యులు మాజీ సిఎం కెసిఆర్‌కు హిప్ రిప్లేస్‌మెంట్ సర్జరీ విజయవంతంగా పూర్తి చేశారు. శుక్రవారం సాయం త్రం ప్రారంభమైన తుంటి ఎముక మార్పిడి సర్జరీ రాత్రికి పూర్తియింది. సర్జరీ పూర్తయిన అనంతరం కెసిఆర్‌ను ఆపరేషన్ థియేటర్ నుంచి ఐసియుకి తరలించారు. పార్టీ అధినేతకు సర్జరీ సక్సెస్ అయిందని తెలియగానే బిఆర్‌ఎస్ శ్రేణులు హ ర్షం వ్యక్తం చేస్తున్నాయి. త్వరలోనే కెసిఆర్ కోలుకుని తమ మధ్యకు వస్తాడన్నారు. కెసిఆర్ సతీమణి శోభ కుమారుడు కెటిఆర్, కుమార్తె కవిత, హరీశ్‌రావు, సంతోష్ తదితరులు యశోద హాస్పిటల్ లో ఉండి కెసిఆర్ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు డాక్టర్లను అడిగి తెలుసుకుంటున్నారు. ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్‌లో కెసిఆర్ బాత్‌రూమ్‌లో కాలు జారిపడిపోయారు. ఘటన జరిగిన వెంటనే ఆయన్ని యశోద హాస్పిటల్‌కు తరలించారు. అర్థరాత్రి రెండున్నర గంటల సమయం లో ఈ ఘటన జరిగింది. కెసిఆర్ ఆరోగ్యంపై ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ఆరా తీశారు. కెసిఆర్ ఆరోగ్య పరిస్థితిపై తనకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని వై ద్య, ఆరోగ్య శాఖాధికారులను ఆదేశించారు. కెసిఆర్‌కు మె రుగైన వైద్య సహాయం అందించాలని వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వికి సూచించారు. సిఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు యశోద హాస్పిటల్‌కు వైద్య, ఆరోగ్య శాఖ సెక్రటరీ రిజ్వీ వెళ్లారు. యశోద ఆసుపత్రి వైద్యులను అడిగి కెసిఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన తెలుసుకున్నారు. కెసిఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని హెల్త్ సెక్రటరీకి యశోద ఆసుపత్రి వైద్యులు వివరించారు. కెసిఆర్‌కు మెరుగైన వైద్య చికి త్స అందించాలని సిఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని రిజ్వి ఆసుపత్రి వర్గాలకు తెలిపారు. కెసిఆర్ బాత్రూంలో జారిపడిన విషయం తెలిసిన వెంటనే ప్రభు త్వం స్పందించింది. గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ క్లియరెన్స్‌తో కెసిఆర్‌ను గురువారం అర్ధరాత్రి ఆసుపత్రికి పోలీసులు తీసుకువచ్చారు. ఆయనను పరీక్షించిన తర్వాత య శోద ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని యశోద ఆసుపత్రి వై ద్యులు ప్రకటించారు. బాత్రూంలో జారిపడడంతో ఆయన ఎడమ తుంటికి ఫ్రాక్చర్ అయిందని వైద్యులు ప్రకటించారు. ఈ గాయం నుండి కోలుకోవడానికి ఆయనకు ఆరు నుండి ఎనిమిది వారాల సమయం పడుతుందని యశోద ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని యశోద ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఇదిలా ఉంటే ఆయనకు సిటి స్కాన్‌తో పాటు ఎడమ తుంటికి శస్త్ర చికిత్స చేసేందుకు అవసరమైన పరీక్షలు నిర్వహించారు. అనంతరం కెసిఆర్‌కు డాక్టర్లు హిప్ రీప్లేస్‌మెంట్ ఆపరేషన్ చేశారు.
పలువురి సందేశాలు
కెసిఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పలువురు సందేశాలు పంపారు. మాజీ సిఎం కెసిఆర్ త్వరగా కోలుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆకాంక్షించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా స్పందించారు. కెసిఆర్‌కు అయిన గాయం గురించి తెలిసి చాలా బాధప డినట్టు తెలిపారు. ఆరోగ్యంగా తిరిగి రావాలని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు. కెసిఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఎపి సిఎం వైఎస్ జగన్ ఆరా తీశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌కు ఫోన్ చేసి కెసిఆర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గురువారం రాత్రి కెసిఆర్ ప్రమాద వశాత్తు బాత్‌రూంలో జారిపడడంతో కాలు విరిగిన విషయాన్ని తెలుసుకున్న జగన్ శుక్రవారం కెటిఆర్‌కు ఫోన్ చేశారు. కెసిఆర్ త్వరగా కోలుకోవాలని జగన్ ఆకాంక్షించారు. కెసిఆర్ త్వరగా కోలుకోవాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆకాక్షించారు. కెసిఆర్‌కు గాయమైందని తెలిసి బాధపడ్డానని పేర్కొన్నారు. ఆయన సంపూర్ణంగా కోలుకోవాలని భగవంతుడ్ని ప్రార్ధిస్తున్నానని పేర్కొన్నారు. కెసిఆర్ ఆరోగ్యంపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ట్వీట్ చేశారు. కెసిఆర్ బాత్రూంలో పడిపోవడంతో ఆయన కాలికి తీవ్ర గాయమైందన్నారు. కెసిఆర్ త్వరగా కోలుకోవాలని సందేశాలు పంపుతున్న వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ కెటిఆర్ ట్వీట్ చేశారు. యశోదా దవాఖానలో చికిత్స పొందుతున్న కెసిఆర్‌ను ఎంఎల్‌సి కవిత పరామర్శించారు. కెసిఆర్‌ను కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి తన సతీమణి, తనయుడు నాగార్జున సాగర్ ఎంఎల్‌ఎ జయవీర్ వెంకట్‌రెడ్డితో కలిసి పరామర్శించారు. శుక్రవారం యశోద దవాఖానలో చికిత్స పొందుతున్న కెసిఆర్‌ను పరామర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు.
కెసిఆర్‌ను చూసేందుకు పోటెత్తిన అభిమానులు
కెసిఆర్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి యశోద దవాఖానకు శుక్రవారం ఉదయం నుంచి అభిమానులు పోటె త్తారు. యశోద హాస్పిటల్ కేసీఆర్ అభిమానులు కార్యకర్తలు మంత్రులు మాజీ మంత్రులు ఎంఎల్‌ఎలతో నిండిపోయింది. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంఎల్‌ఎలు ఎంఎల్‌సిలు, మాజీ చైర్మన్లు ప్రజాప్రతినిధులు కెసిఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. కెసిఆర్‌ను చూడటానికి లేదా పరామర్శిం చడానికి ఎవరూ ఆసుపత్రికి రావొద్దని మాజీ మంత్రి, సిద్దిపేట ఎంఎల్‌ఎ హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు. కెసిఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News