Sunday, June 15, 2025

కైనెటిక్ గ్రీన్ 2-వీలర్ బిజినెస్ ప్రెసిడెంట్ గా జయప్రదీప్ వాసుదేవన్

- Advertisement -
- Advertisement -

పూణే: కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ అండ్ పవర్ సొల్యూషన్స్ లిమిటెడ్, భారతదేశంలో ఎలక్ట్రిక్ టూ మరియు త్రీ వీలర్ల ప్రముఖ తయారీదారు, తన ఎలక్ట్రిక్ టూ వీలర్ బిజినెస్ ప్రెసిడెంట్ గా జయప్రదీప్ వాసుదేవన్ ను నియమించినట్లు ప్రకటించడం ఆనందంగా ఉంది. ఆటోమొబైల్ రంగంలో 25 సంవత్సరాలకు పైగా అనుభవాన్ని కలిగిన శ్రీ జయప్రదీప్ వాసుదేవన్, వ్యూహాత్మక నాయకత్వం, వ్యాపార అభివృద్ధి, సంస్థ పురోగతి మరియు విభిన్న ఆటోమోటివ్ OEMలతో కూడిన వాణిజ్య కార్యకలాపాలపై విశేష నైపుణ్యం కలిగి ఉన్నారు.

పరిశ్రమలో “JP” అనే పేరుతో ప్రసిద్ధులైన మిస్టర్ జయప్రదీప్, కైనెటిక్ గ్రీన్ తమ ద్విచక్ర వాహన వ్యాపారాన్ని విస్తరించేందుకు సిద్ధమవుతున్న కీలక దశలో సంస్థలో చేరుతున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ఇ-లూనా మోడల్ మరియు ఇతర శ్రేణుల అమ్మకాలను మెరుగుపరచడంలో ఆయన కీలక పాత్ర పోషించనున్నారు. అదే సమయంలో, ఈ ఏడాది చివర్లో ప్రారంభించనున్న అధునాతన సాంకేతికతతో కూడిన హై-పవర్ ఎలక్ట్రిక్ స్కూటర్ వంటి రాబోయే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కోసం ‘గో-టు-మార్కెట్’ వ్యూహానికి ఆయన నాయకత్వం వహించనున్నారు. దేశవ్యాప్తంగా బ్రాండ్ ఉనికిని బలోపేతం చేయడం మరియు కస్టమర్ అనుభవాన్ని మరింత పెంచడానికి కైనెటిక్ గ్రీన్ యొక్క డీలర్‌షిప్‌ల నెట్‌వర్క్ విస్తరణను మరింత బలోపేతం చేయడానికి JP తన నాయకత్వాన్ని అందించనున్నారు.

బృందంలో జేపీకి స్వాగతం పలుస్తూ, సులజ్జా ఫిరోడియా మోట్వానీ, వ్యవస్థాపకురాలు మరియు సీఈఓ, కైనెటిక్ గ్రీన్ ఇలా పేర్కొన్నారు.. “మన ప్రయాణంలో ఈ కీలకమైన మార్పుల దశలో జేపీ కైనెటిక్ గ్రీన్‌లో చేరినందుకు మేము ఎంతో ఉత్సాహంగా ఉన్నాం. మేము మా నాయకత్వాన్ని విస్తరిస్తున్న తరుణంలో, ఆయనకున్న విస్తృత అనుభవం, లోతైన పరిశ్రమ అంతర్దృష్టి, వినియోగదారులపై దృష్టి సారించిన దృక్పథం మరియు కేంద్రీకృత అమలు సామర్థ్యం మాకు అమూల్యమైనదిగా నిలవనుంది. జేపీ మా ద్విచక్ర వాహన వ్యాపారాన్ని ముందుండి నడిపిస్తూ, మా ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియో ప్రభావాన్ని మరింత విస్తరించేందుకు మేము కట్టుబడి ఉన్నాము. భారతదేశంలోని ఎలక్ట్రిక్ వ్యక్తిగత రవాణా విభాగంలో అగ్రస్థానంలో నిలవాలన్న మా లక్ష్యాన్ని సాధించగలమన్న పూర్తి నమ్మకంతో ముందుకు సాగుతున్నాము.”

ఈ కొత్త పాత్ర పట్ల తన ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తూ, మిస్టర్ జయప్రకాశ్ ఇలా అన్నారు..”కైనెటిక్ గ్రీన్‌లో చేరటం మరియు దాని ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన వ్యాపారాన్ని ముందుండి నడిపించేందుకు నాకు గౌరవంగా మరియు ఆనందంగా ఉంది. ఈ బ్రాండ్ సమృద్ధిగల వారసత్వాన్ని కలిగి ఉండడమే కాక, భారతదేశ ప్రజలకు వినూత్నమైన, స్థిరమైన ఎలక్ట్రిక్ మొబిలిటీ పరిష్కారాలను అందిస్తూ నేటికీ ప్రాముఖ్యతను కొనసాగిస్తోంది. నెట్-జీరో ఇండియా దిశగా దేశం సాగుతున్న తరుణంలో, కైనెటిక్ గ్రీన్ దాని ప్రయాణంలో కీలక పాత్ర పోషించనుందని నాకు విశ్వాసం ఉంది. వినియోగదారుల కేంద్రీకరణకు ప్రాధాన్యత ఇస్తూ, సమర్థవంతమైన పంపిణీ నెట్‌వర్క్, మరియు గ్లోబల్ స్టాండర్డ్స్‌కు తగిన నాణ్యమైన ఉత్పత్తుల ద్వారా కంపెనీ ద్విచక్ర వాహన వ్యాపార వృద్ధికి నేనూ నా పూర్తి కట్టుబాటుతో తోడ్పడతాను.”

జేపీ తన వృత్తిపరమైన జీవితం నుండి 15 సంవత్సరాలను రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు అంకితం చేశారు, అక్కడ ఆయన ఇండియా బిజినెస్ హెడ్‌గా వ్యవహరిస్తూ కంపెనీ వృద్ధికి దిశానిర్దేశం చేశారు. దేశవ్యాప్తంగా నెట్‌వర్క్ విస్తరణకు మరియు వినూత్న రిటైల్ మోడల్స్ అమలుకు ఆయన చేసిన కృషి, అమ్మకాలలో గణనీయమైన వృద్ధి మరియు మార్కెట్ వాటా పెరుగుదలకు దోహదపడింది. ఇందుకు ముందు, జేపీ హిందూస్తాన్ మోటార్స్ మరియు టఫే వంటి ప్రముఖ ఆటోమోటివ్ సంస్థల్లో కీలక నాయకత్వ బాధ్యతలు నిర్వహించారు, తద్వారా పరిశ్రమలో బలమైన పునాదిని ఏర్పరుచుకున్నారు. ఇటీవల ఆయన రాప్టీ అనే ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ స్టార్టప్‌లో చీఫ్ బిజినెస్ ఆఫీసర్‌గా సేవలందించారు. అక్కడ వ్యూహాత్మక ప్రయత్నాల ద్వారా బ్రాండ్‌ను ద్విచక్ర వాహన విభాగంలో ఒక ప్రీమియం ప్లేయర్‌గా నిలబెట్టడంలో ఆయన ముఖ్య పాత్ర పోషించారు.

కైనెటిక్ గ్రీన్‌లో, జేపీ సంస్థ ఉనికిని వ్యూహాత్మకంగా విస్తరించేందుకు మిస్టర్ రితేష్ మంత్రి (సహ వ్యవస్థాపకుడు మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్)తో సమన్వయంగా పని చేస్తారు. అదే సమయంలో, వారు స్థిరమైన మొబిలిటీ పరిష్కారాలలో సంస్థ యొక్క తదుపరి వృద్ధి అధ్యాయాన్ని సాధించడానికి కట్టుబడి ఉంటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News