Friday, May 16, 2025

పీరియాడిక్ క్రైమ్ డ్రామా

- Advertisement -
- Advertisement -

సుధాకర్ చెరుకూరి నేతృత్వంలోని ఎస్‌ఎల్‌వి సినిమాస్ ప్రస్తుతం 1990ల నేపథ్యంలో సాగే ఒక పీరియాడిక్ క్రైమ్ డ్రామా నిర్మిస్తోంది. ‘కెజెక్యూ’ (కింగ్ జాకీ క్వీన్) అనే టైటిల్ తో రూపొందిన ఈ చిత్రంలో బ్లాక్ బస్టర్ దసరా చిత్రంలో తన అద్భుతమైన నటనతో గుర్తింపు పొందిన దీక్షిత్ శెట్టితో పాటు శశి ఓదెల, యుక్తి తరేజ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కె.కె. దర్శకత్వం వహించారు. బుధవారం నేచురల్ స్టార్ నాని సినిమా టీజర్‌ను లాంచ్ చేశారు. టీజర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో దీక్షిత్ శెట్టి మాట్లాడుతూ “ఈ సినిమా కోసం టీమంతా చాలా కష్టపడ్డాం. తప్పకుండా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది”అని అన్నారు. ఈ కార్యక్రమంలో హీరో శశి, హీరోయిన్ యుక్తి తరేజా, డైరెక్టర్ కేకే, నాగేష్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News