Thursday, April 25, 2024

పైలెట్ల ప్రాణాలు కాపాడిన ప్యారాచూట్… (వీడియో)

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: భారత వైమానిక దళానికి చెందిన సూర్యకిరణ్ ట్రైనర్ విమానం కర్ణాటకలోని చామ్‌రాజ్‌నగర్ జిల్లా బోగాపురా గ్రామ సమీపంలో గురువారం కూలిపోయింది. సాధారణ శిక్షణ సమయంలో ఈ ఘటన జరిగింది. ఐఎఎఫ్ కి చెందిన ట్రైనర్ విమానం చామ్‌రాజ్‌నగర్ సమీపంలో సాధారణ శిక్షణలో ఉండగా కూలిపోయింది.

విమాన సిబ్బంది ఇద్దరూ ప్యారాచూట్ల సాయంతో సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి కోర్టు ఆఫ్ ఎంక్వైరీని ఆదేశించింది. ప్రమాదానికి ముందు ఒక మహిళా పైలట్‌తో సహా ఇద్దరు పైలట్లు తప్పించుకుని ఫ్లైట్ నుండి బయటపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News