Wednesday, May 1, 2024

పదేళ్లలో పది లక్షల కోట్లు

- Advertisement -
- Advertisement -

బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు రూ.10 లక్షల కోట్లు కేటాయించిందని మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్‌లో ”రిపోర్టు టూ పీపుల్‌” పేరిట నివేదిక ను కిషన్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా గత తొమ్మిదేళ్ళలో ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్రం ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి అందించిన సహకారం గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను కిషన్ రెడ్డి చేశారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ ఎంపీగా , కేంద్రమంత్రిగా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోనూ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన అభివృద్ధి కా గురించి వివరిస్తూ నివేదికను ప్రజల ముందు కిషన్ రెడ్డి ఉంచారు. తనపై ఇప్పటి వర కు ఒక్క అవినీతి మచ్చ లేదన్నారు. తాను ఎలాం టి అక్రమాలకు పాల్పడలేదన్నారు. తాను ఎవరినీ బెదిరించలేదని, ఎవరిపైనా పక్షపాత ధోరణితో వ్యవహరించలేదన్నారు. తనపై కొందరు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. తనపై విమర్శలు చేసిన వారికి ప్రజలు గతంలోనే బుద్ధి చెప్పారన్నారు.

నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి అభివృద్ధి కోసం పని చేశానని భావిస్తేనే ఓటేయాలన్నారు. తనను మళ్లీ గెలిపించి ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు .గత పదేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి పన్నుల వాటా పంపిణీ కింద అందించిన నిధులు, సంక్షేమ కార్యక్రమాల కింద చేసిన ఖర్చు , అర్హులైన లబ్ధిదారులకు వివిధ పధకాల కింద అందించిన రుణాలకు చెల్లించిన వడ్డీ రాయితీ, రైతులకు కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేసిన వ్యవసాయ ఉత్పత్తుల గురించి ప్రస్తావించారు. ప్రపం చ వ్యాప్తంగా ఫెర్టిలైజర్స్ ధరలు పెరిగితే మన దగ్గ ర కొరత లేకుండా ఇచ్చామని ఆయన చెప్పారు. ఒక యూరియా బస్తా మీద 2236 రూపాయల సబ్సిడీని కేంద్రం ఇస్తుందన్నారు. పీఎం కిషన్ సమ్మాన్ నిధి కింద రైతులకు పెట్టుబడి సాయం ఇస్తున్నామని ఆయన తెలిపారు. ఆసియలోనే అది పెద్ద బయో మెడికల్ రీసెర్చ్ సెంటర్ కు హైదరాబాద్ లో భూమి పూజా చేశామన్నారు. 889 కోట్లతో సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజలు తనను గెలిపించారు కాబట్టి వారికి జవాబు దారిగా ఉండాల న్నారు.

తాను ఏం చేశానో దాదాపు 300 పేజీలతో పుస్తకాన్ని తయారు చేశామన్నారు. మొదటి సారి హోం శాఖ సహాయ మంత్రిగా పని చేశానని వెల్లడించారు. సహాయ మంత్రిగా 8 రాష్ట్రాలకు ఇంచార్జ్ గా ఉన్నానని అన్నారు. ఆర్టికల్ 370 తొలగించినప్పుడు నేను హోం శాఖలోనే ఉన్నానని తెలిపారు. ఆర్టికల్ 370 రద్దులో నేను భాగం కావ తన అదృష్టం అన్నారు. కరోనా వచ్చినప్పుడు హోం శాఖను నోడల్ మినిస్ట్రీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం అని తెలిపారు. నోడల్ సెంటర్ కు ఇంచార్జ్ గా పని చేసి, కరోనా టైంలో సేవ చేశానని వెల్లడించారు. రెండున్నర ఏళ్ల తరువాత నాకు మూడు శాఖలు ఇచ్చి క్యాబినెట్ మినిస్టర్ గా అవకాశం ఇచ్చారన్నారు. కల్చర్ మినిస్టర్ గా దేశ వ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ నిర్వహించానని అన్నారు. కేంద్ర మంత్రిగా దేశానికి సేవ చేసే అవకాశం దక్కిందని వెల్లడించారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్మాణం చేపడుతున్న జాతీయ రహదార్లు, రైల్వే లైన్లు, కాజీపేటలో నిర్మిస్తున్న రైల్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్, వరంగల్ లో ఏర్పాటు చేయనున్న పీఎం మిత్ర టెక్స్ టైల్స్ పార్కు, రామగుండంలో కొత్తగా నిర్మించిన ఎరువుల కర్మాగారం,

కొత్త థర్మల్ పవర్ ప్లాంట్లు, హైదరాబాద్ మెట్రోకు వ యబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద అందించిన ని ధులు, సిద్ధిపేట జిల్లా ములుగులో నిర్మించి కొం డా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యానవన విశ్వవిద్యాల యం, ములుగు జిల్లాలో సమ్మక్క సారక్క కేంద్రీ య గిరిజన యూనివర్సిటీ, బీబీనగర్ ఎయిమ్స్, హైదరాబాద్ ఐఐటీ, పశువుల ఔషధాల మీద పరిశోధనల కోసం నిర్మించిన దక్షిణాసియాలోనే అతిపెద్ద బయో మెడికల్ రీసెర్చ్ సెంటర్, కరోనా సమయంలో మొదలు పెట్టిన ఉచిత రేషన్ బియ్యం పంపిణీ, వ్యాక్సినేషన్, రైతులకు సబ్సిడీ కింద అందిస్తున్న ఎరువులు తదితర అంశాల గురించి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News