Monday, June 9, 2025

బుజ్జగింపుల పర్వం

- Advertisement -
- Advertisement -

రగిలిపోతున్న రాజగోపాల్‌రెడ్డి

మంత్రి పదవులు దక్కని ఆశావహుల అలక సుదరన్‌రెడ్డి, మల్‌రెడ్డి
వద్దకు కాంగ్రెస్ అగ్రనేతలు పార్టీ పెద్దలను కలిసేందుకు కోమటిరెడ్డి
రాజగోపాల్‌రెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావు నిరాకరణ, ఫోన్లు స్విచ్చాఫ్

మంత్రి పదవి దక్కకపోవడంతో
అజ్ఞాతంలోకి మునుగోడు
ఎంఎల్‌ఎ తదుపరి
అడుగులపై ఉత్కంఠ

మన తెలంగాణ/హైదరాబాద్: మంత్రివర్గ విస్తరణ అధికార కాంగ్రెస్ పార్టీలో చిచ్చురేపింది. మంత్రి పదవులు ఆశించి భంగపడిన నేతలను తీవ్ర ఆసంతృప్తికి గురి చేసింది. తమకు మంత్రిపదవులు ఇస్తామని అనేక సందర్భాలలో ఇచ్చిన హామీని అధిష్ఠానం నిలబెట్టుకోలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేసారు. పార్టీపై అలకవహించి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖం చాటేసారు. విస్తరణలో మంత్రి పదవి ఖాయమని చివరి దికా నమ్మించి తనను మోసం చేసారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పి. సుదర్శన్‌రెడ్డి ఏకంగా రాజీనామాకు సిద్ధపడ్డారు. అలాగే మంత్రి పదవి ఆశించి భంగపడిన ఉమ్మడి నల్లగొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు పార్టీ పెద్దలను కలువడానికి నిరాకరించి తమ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసుకున్నారు.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి తనకు మంత్రి పదవి ఇవ్వకుంటే రాజీనామా చేస్తానని ఇదివరకే హెచ్చరించిన నేపథ్యంలో తన నిర్ణయాన్ని ప్రకటించడానికి ప్రెస్‌మీట్ కూడా ఏర్పాటు చేసారు. మంత్రివర్గ విస్తరణ పార్టీలో అసమ్మతి సెగలు రేగడంతో అధిష్టానం వెంటనే అప్రమత్తం అయింది.ఒకవైపు రాజ్‌భవన్‌లో మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం కొనసాగుతుండగానే మరోవైపు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, ముఖ్యమంత్రి రాజకీయ సలుహాదారు వేం నరేందర్‌రెడ్డి హుటాహుటిని రాజీనామాకు సిద్ధపడిన సుదర్శన్‌రెడ్డి ఇంటికి వెళ్లి బుజ్జగించారు. మంత్రివర్గంలో ఇంకా మూడు ఖాళీలు ఉం డటంతో మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కోటాలో మలి విడత విస్తరణలో తప్పకుండా అవకాశం కల్పిస్తామని, ఇది పార్టీ పెద్దలు ఇచ్చిన మాట గా సుదర్శన్‌రెడ్డికి నచ్చజెప్పారు. దీంతో సుదర్శన్‌రెడ్డి చల్లబడ్డారు. అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని హామీ ఇవ్వడంతో అక్కడి నుంచి వారు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావు ఇళ్లకు కూడా వెళ్లిందుకు ప్రయత్నించారు.

అయితే వారు తమ ఫోన్ల స్విచ్ చేసుకోవడంతో ఆ ప్రయత్నాలను విరమించుకున్నారు. కాగా అంతకుముందు మంత్రివర్గంలో అవకాశం లభించిన వివేక్ వెంకటస్వామి కూడా తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని ఆహ్వానించడానికి వారి ఇంటికి వెళ్లగా ఆయన ఇంట్లో లేరని సమాధానం చెప్పినట్టు తెలిసింది. తమను కలువడానికి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావు నిరాకరించడంతో వారికి సన్నితంగా ఉండే మంత్రుల ద్వారా బుజ్జగింపు ప్రయత్నాలు చేస్తోన్నట్టు తెలిసింది. ఇలా ఉండగా తనకు మంత్రి పదవి ఇవ్వకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ముందుగానే ప్రకటించిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి తన నిర్ణయాన్ని ప్రకటించడానికి ఆదివారం సాయంత్రం 5 గంటలకు ప్రెస్‌మీట్ ఏర్పా టు చేసినట్టు ప్రకటించారు.దీంతో మీనాక్షి నటరాజన్, మహేశ్‌కుమార్‌గౌడ్ తాము ఇద్ద రం మీ ఇంటికి వచ్చి మాట్లాడే వరకు ఏ నిర్ణ యం తీసుకోవద్దని కోరడంతో ఆయన తన ప్రెస్‌మీట్ రద్దు చేసుకున్నారు. వీరు హామీ ఇచ్చినట్టుగానే సాయంత్రం మల్‌రెడ్డి రంగారెడ్డి ఇంటికి మీనాక్షినటరాజన్, మహేశ్‌కుమార్ గౌడ్ వెళ్లి బుజ్జగించడంతో ఆయన కూ డా చల్లబడినట్టు పార్టీ వర్గాల సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News