Sunday, April 28, 2024

బరిలో ముగ్గురు ఎంపిలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బిజెపి ప్రకటించింది. కీలక నేతల పేర్లు ఖరారయ్యాయి. కరీంనగర్ ఎంపి గా ఉన్న జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ని కరీంనగర్ అసెంబ్లీ అభ్యర్థిగా ఖరారు చేశారు. మరోవైపు కోరుట్ల అభ్యర్థిగా నిజామాబాద్ ఎంపిగా ఉన్న ధర్మపురి అరవింద్, బోథ్ నియోజకవర్గం అభ్యర్థిగా ఆదిలాబాద్ ఎంపి సోయం బాపురావును ప్రకటించారు. తొలి జాబితాలో కిషన్ రెడ్డి పేరు ప్రకటించక పోవడం విశేషం. ఎమ్మెల్యే ఈటల రాజేందర్, గజ్వేల్, హుజూరాబాద్ స్థానాల నుంచి పోటీ చేయనున్నారు. రాజేందర్ సిఎం అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. రాజాసింగ్ సస్పెన్షన్ ఎత్తివేయగా, ఆయన మరోసారి గోషామహల్ నుంచి పోటీ చేయనున్నారు. మరో సిట్టింగ్ ఎమ్మెల్యే రఘునందన్ రావు దుబ్బాక నుంచి పోటీ చేయనున్నారు. తొలి జాబితాలో 12 మంది మహిళలు, 20 మంది బిసిలు, 18 మంది ఓసిలు, 8 మంది ఎస్సీ, నలుగురు ఎస్టీ అభ్యర్థులకు బిజెపి స్థానం కల్పించింది. ఖానాపూర్ నుంచి మాజీ ఎంపి రమేష్ రాథోడ్, చొప్పదండి నుంచి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, ఖైరతాబాద్ నుంచి మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పోటీ చేయనున్నారు. కల్వకుర్తి నుంచి మరోసారి ఆచారికే అవకాశం లభించింది. బిఆర్‌ఎస్ నుంచి పార్టీలో చేరిన బోగ శ్రావణికి జగిత్యాల, రామగుండం-లో కందుల సంధ్యారాణి, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్‌కు మానకొండూరు స్థానాన్ని కేటాయించారు. సిరిసిల్ల అభ్యర్థిగా రాణి రుద్రమను ప్రకటించారు. తొలి జాబితాలో 52 మందితో పేర్లును ప్రకటించారు.
పలువురి పేర్లు గల్లంతు…
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం సీటును ఆశించిన మాజీ ఎంపి బూర నర్సయ్యగౌడ్‌కు అవకాశం రాకపోవడంతో పాటు ఆ స్థానంలో నోముల దయానంద్‌గౌడ్‌కు ఈ సీటు ఖరారు చేశా రు. ఈ జాబితాలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. గతేడాది జరిగిన ఉప ఎన్నికల్లో బిజెపి తరపున పోటీ చేసి ఓడిపోయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు గత శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన విజయశాంతి, డికె అరుణ, వివేక్ వెంకట్ స్వామి, లక్ష్మణ్ పేర్లు ఈ జాబితాలో దక్కలేదు.
దసరా తర్వాత రెండో జాబితా : కిషన్‌రెడ్డి
ప్రస్తుత శాసనసభ్యులు, ఎంపిలు, మున్సిపల్ చైర్మన్లు తదితరులకు మొదటి జాబితాలో చోటు దక్కిందని, దసరా తర్వాత రెం డో జాబితాను ప్రకటిస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి వెల్లడించారు. ఆదివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 27న రాష్ట్రంలో జరిగే బహిరంగ సభకు హోంశాఖ మంత్రి అమిత్‌షా రానున్నారని తెలిపారు. ఈ నెల 27 నుంచి 31 వరకు జరిగే పలు బహిరంగ సభల్లో యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్‌తో పాటు బిజెపి అగ్రనేతలు పాల్గొనున్నారని చెప్పా రు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్టాటంగా ప్రచారం చేసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్మీబ్యారేజీకి సంబంధించిన ఫిల్లర్లు కుం గాయి. ఇంజనీర్లు రాజకీయ నాయకులు అక్కడికి వెళ్తే.. వాళ్ల ను పరిశీలించనీయకుండా అడ్డుకుంటున్నారు. లక్షన్నర కోట్ల ప్రాజెక్ట్ పతనమవుతుంటే ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదని ఆరోపించారు. కుంగిన బ్రిడ్జిని ఎమ్మె ల్యే రాజేందర్ పరిశీలించనున్నారని వెల్లడించారు. రాష్ట్ర సంపదను కొల్లగొట్టిన ఈ ప్రాజెక్టు.. ప్రారంభించిన మూడేండ్లలోనే కొంత భాగం కుంగిపోయిందని విమర్శించారు.
గతంలో గో దావరిలో వరదలు వచ్చినప్పుడు పంప్‌హౌజ్‌లు మునిగిపో యి.. మోటార్లు మునిగి వేల కోట్ల నష్టం వచ్చింది ఇప్పుడు ప్రా జెక్టు కుంగిపోతున్నది. లోపాలు బయటపడుతున్నాయి. ఐదేండ్లలో 150 టిఎంసిల నీళ్లు ఎత్తిపోసి.. వాటిని మళ్లీ కిందకు వదిలారని గుర్తుచేశారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని 5 సభల్లో, అమిత్ షా 3 సభల్లో పాల్గొన్నారు. త్వరలోనే మరోసారి అమిత్ షా, సిఎం యోగి ఆదిత్యనాథ్ రానున్నారు. దసరా తర్వాత బిజెపి ఎన్నికల కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తామని వెల్లడించారు. జనసేన అధినేత పవన్ కల్యా ణ్‌తో ప్రాథమికంగా కలిసి, మాట్లాడం పొత్తు అంశం పార్టీ నిర్ణయం తీసుకుంటుందని కిషన్‌రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర ప్రజలకు విజయదశమి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఎంపి అర్వింద్,ఎమ్మెల్యే రాజాసింగ్‌లుపాల్గొన్నారు.
బిజెపి అభ్యర్థుల తొలి జాబితా:
1. సిర్పూర్ – డా.పాల్వాయి హరీష్ బాబు
2. బెల్లంపల్లి ఎ.శ్రీదేవి
3. ఖానాపూర్ -రమేష్ రాథోడ్
4. ఆదిలాబాద్- పాయల్ శంకర్
5. బోథ్-సోయం బాపూరావు
6. నిర్మల్- ఏలేటి మహేశ్వర్ రెడ్డి
7. ముథోల్- రామారావు పటేల్
8. ఆర్మూర్ పైడి రాకేష్ రెడ్డి
9. జుక్కల్- టి.అరుణతార
10. కామారెడ్డి కె.వెంకటరమణ రెడ్డి
11. నిజామాబాద్ (అర్బన్) ధన్‌పాల్ సూర్యనారాయణ
12. బాల్కొండ- ఏలేటి అన్నపూర్ణమ్మ
13. కోరుట్ల- ధర్మపురి అరవింద్
14. జగిత్యాల- డాక్టర్ భోగ శ్రావణి
15. ధర్మపురి- ఎస్. కుమార్
16. రామగుండం- కందుల సంధ్యారాణి
17. చొప్పదండి- బొడిగె.శోభ
18. సిరిసిల్ల -రాణిరుద్రమ రెడ్డి
19. మానకొండూరు ఆరేపల్లి. మోహన్
20. హూజూరాబాద్ -ఈటల రాజేందర్
21. నర్సాపూర్- ఎ.మురళీయాదవ్
22. పటాన్ చెరు- నందీశ్వర్ గౌడ్
23. దుబ్బాక -రఘునందన్ రావు
24. గజ్వేల్ -ఈటల రాజేందర్
25. కుత్బుల్లాపూర్- కూన శ్రీశైలం గౌడ్
26. ఇబ్రహీంపట్టణం- నోముల దయానంద్ గౌడ్
27. మహేశ్వరం- అందెల శ్రీశైలం యాదవ్
28. ఖైరతాబాద్- చింతల రామచంద్రారెడ్డి
29. కార్వాన్- అమర్ సింగ్
30. గోషామహల్- రాజాసింగ్
31. చార్మినార్ -మేఘారాణి
32. చాంద్రాయణగుట్ట- సత్యనారాయణ ముదిరాజ్
33. యాఖత్ పురా -వీరేందర్ యాదవ్
34. బహదూర్ పుర -వై. నరేష్ కుమార్
35. కల్వకుర్తి- టి. ఆచారి
36. కొల్లాపూర్ -ఎ.శ్రీధర్ రావు
37. నాగార్జునసాగర్- కె.నివేదిత రెడ్డి
38. సూర్యాపేట- సంకినేని వెంకటేశ్వరరావు
39. భువనగిరి- గూడూరు నారాయణ రెడ్డి
40. తుంగతుర్తి- కడియం రామచంద్రారావు
41. జనగామ- ఎ.దశమంత్ రెడ్డి
42. స్టేషన్ ఘన్ పూర్ విజయరామారావు
43. పాలకుర్తి- రామ్మోహన్ రెడ్డి
44. డోర్నకల్- భూక్యా సంగీత
45. మహబూబాబాద్- జానోత్ హుస్సేన్ నాయక్
46. వరంగల్ పశ్చిమ- రావు పద్మ
47. వరంగల్ ఈస్ట్- ఎర్రబెల్లి ప్రదీప్ రావు
48. వర్ధన్నపేట- కొండేటీ శ్రీధర్
49. భూపాలపల్లి- చందుపట్ల కీర్తి రెడ్డి
50. ఇల్లెందు -రవీంద్రనాయక్
51. భద్రాచలం- కుంజా ధర్మారావు
52. కరీంనగర్- బండి సంజయ్

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News