Friday, May 3, 2024

తెలంగాణలో వార్ వన్ సైడ్…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణలో వా ర్ వన్ సైడేనని, బిఆర్‌ఎస్ పార్టీ భారీ మెజారిటీతో మరోసారి అధికారంలోకి వస్తుందని ఎంఎల్‌సి క ల్వకుంట్ల కవిత ధీమా వ్యక్తం చేశారు. సిఎం కెసిఆ ర్ మూడోసారి ముఖ్యమంత్రి అయ్యి హ్యాట్రిక్ కొడతారని తేల్చిచెప్పారు. సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడానికి సోలాపూర్ వెళ్లిన కవిత అక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత పది ఏళ్లలో రైతులు, మహిళలు, యువ త, ఎస్‌సి, ఎస్‌టి, బిసి సాధికారత కోసం బి ఆర్‌ఎస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం చేసిన మంచి పనులే తమను గేలిపిస్తాయని పేర్కొన్నారు. సిఎం కెసిఆర్‌ను మరొకసారి ఆశీర్వదించేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.

బిజెపికి 105 సీట్లలో డిపాజిట్లు కోల్పోతుంది
గత ఎన్నికల్లో 105 సీట్లలో బిజెపి డిపాజిట్ కోల్పోయిందని, ఈ ఎన్నికల్లో అన్ని సీట్లలో డిపాజిట్ కోల్పోతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఎప్పుడూ మభ్యపెడుతూనే ఉంటుందని విమర్శించారు. 65 ఏళ్ల పాటు అధికారాన్ని అనుభవించిన కాంగ్రెస్ పార్టీ చేయనన్ని పనులను గత 10 ఏళ్లలో సిఎం కెసిఆర్ చేసి చూపించారని తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించారు కాబట్టి తమ పా ర్టీ వైపు నిలుస్తారన్న విశ్వాసం ఉందని చెప్పారు. తమ పథకాలను కాపీ కొట్టి 6 గ్యారంటీల పేరిట కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిందని, మరి ఈ ఆరు గ్యారెంటీల అమలకు ఏ నాయకుడు గ్యారెంటీ ఇస్తారని ప్రశ్నించారు. దళితనేత, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కాదని గాంధీ కుటుంబం గ్యా రంటీల హా మీలు ఇస్తోందని వి మర్శించారు. తెలంగాణ సంస్కృతిని మహారాష్ట్రలో కొనసాగించడం సంతోషంగా ఉందనీ,మహారాష్ట్ర సంస్కృతిని కూడా పా టిస్తూ అక్కడ తెలంగాణ వా సులు గంగా జమున తహజీబ్‌లా కలిసిపోయారని ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత హర్షం వ్యక్తం చేశారు.

చేనేత పరిశ్రమలను సందర్శించిన కవిత
సోలాపూర్ పర్యటనలో భాగంగా కల్వకుంట్ల కవి త చేనేత పరిశ్రమలను సందర్శించారు. వాటిలో పనిచేస్తున్న కార్మికులతో మాట్లాడారు. మహారాష్ట్ర ప్రభుత్వం చేనేత పరిశ్రమకు ఎటువంటి సహాయ సహకారాలు అందించడం లేదని వారు కవిత దృష్టికి తీసుకొచ్చారు. తెలంగాణలో చేనేత కార్మికులకు పెన్షన్లు అందిస్తూ బిఆర్‌ఎస్ ప్రభుత్వం భరోసానిస్తుండడం సంతోషంగా ఉందని అన్నారు. అయితే, మహారాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభు త్వం కానీ చేనేత రంగాన్ని విస్మరించడం వల్ల సంబంధిత పరిశ్రమలు కుదేలవుతున్నాయని కవి త ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే, సోలాపూర్ లో పెద్ద సంఖ్యలో ఉన్న బిడి కార్మికులను కల్వకుంట్ల కవిత కలుసుకున్నారు.

మహారాష్ట్రలో బిడి కార్మికులు పడుతున్న కష్టాలను అడిగి తెలుసుకున్నారు. సోలాపూర్‌లో దాదాపు 70 వేల మంది బిడి కార్మికులు ఉన్నారని, మహారాష్ట్ర ప్రభుత్వం బిడి కార్మికులను ఆదుకునే ప్రయత్నం చేయడం లేదని వారు కవిత దృష్టికి తీసుకువచ్చారు. తెలంగాణలో బిడి కార్మికులకు అందిస్తున్న రూ. 2 వేల పెన్షన్‌ను మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వా త రూ. 3 వేలకు పెంచాలని సిఎం కెసిఆర్ సంకల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. బిఆర్‌ఎస్ పార్టీకి అండగా ఉండి ఓట్లు వేయాలని తెలంగాణలోని వారి బంధుమిత్రులను కోరుతున్నామని వా రు కవితకు చెప్పారు.

ఆడబిడ్డలతో కలిసి బతుకమ్మ ఆడిన కవిత
బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడానికి సోలాపూర్ వెళ్లి న కల్వకుంట్ల కవితకు స్థానిక నాయకులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. పట్టణంలోని పుంజల్ మైదాన్‌లో జరిగిన సంబరాల్లో పెద్ద సంఖ్యలో పా ల్గొన్న ఆడబిడ్డలతో కలిసి కవిత బతుకమ్మ ఆడారు. సోలాపూర్‌లో మధ్యాహ్నం నగేష్ వాల్యాల్ నివాసంలో బతుకమ్మను పేర్చారు. అనంతరం దశరథ్ గోప్ నివాసానికి వెళ్లారు. తదనంతరం దత్త మం దిర్ నుంచి మొదలైన బతుకమ్మ ర్యాలీలో కవిత మహిళలతో కలిసి నడిచారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News