Friday, May 17, 2024

ఈనెల 06న తెలంగాణలో ప్రియాంక గాంధీ పర్యటన

- Advertisement -
- Advertisement -

ఎన్నికల ప్రచారం నిమిత్తం కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ తెలంగాణకు రానున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాన్ని అనుసరిస్తూ కాంగ్రెస్ కీలక నేతలతో రాష్ట్రంలో ప్రచారాన్ని నిర్వహిస్తోంది. అందులో భాగంగానే కాంగ్రెస్ కీలక నాయకురాలు ప్రియాంక గాంధీ తెలంగాణలో ప్రచారం చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే మే 6వ తేదీన తాండూరు పట్టణంలో భారీ సభను నిర్వహించేందుకు కాంగ్రెస్ చర్యలు చేపట్టింది. కాగా, ప్రియాంక గాంధీ వరుసగా 6, 7, 8 తేదీల్లో తెలంగాణలో పలు నియోజకవర్గాల్లో ప్రియాంకగాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News