Friday, March 29, 2024

కానిస్టేబుల్ కుటుంబానికి మంత్రి పరామర్శ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/పెగడపల్లిః మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన కానిస్టేబుల్ రమణచారి మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గురువారం కలిసి పరామర్శించారు. మృతుని చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. రమణచారి మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పరంగా మృతుని కుటుంబాన్ని ఆదుకుంనేందుకు కృషిచేస్తానని మంత్రి తెలిపారు.

కల్వర్టు నిర్మాణానికి కృషి చేస్తా:మంత్రి కొప్పుల ఈశ్వర్
మండలంలోని ల్యాగలమర్రి, ఎల్లాపూర్ గ్రామాలను కలిపే రోడ్డు మధ్య గల కల్వర్లు ఇటీవల కురిసిన వర్షాల తాకిడికి కొట్టుకుపోయింది. ధ్వంసమైన కల్వర్టును మంత్రి ఈశ్వర్ గురువారం స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. త్వరలోనే కల్వర్టు నిర్మించేందుకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News