Monday, April 29, 2024

కెటిఆర్ జన్మదినం సందర్భంగా ఢిల్లీలో మొక్కలు నాటిన తెలంగాణ ఎంపిలు

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ:  బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కె తారకరామారావు జన్మదినం సందర్భంగా “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” సృష్టికర్త జోగినిపల్లి సంతోష్ కుమార్, ఆధ్వర్యంలో ఇవాళ ఢిల్లీలోని ముఖ్యమంత్రి నివాసంలో తెలంగాణ ఎంపిలు మొక్కలు నాటారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. మానవ మనుగడకు చెట్లు జీవనాడులని రాజ్యసభ పక్షనేత కె. కేశవరావు తెలిపారు.

Also Read: భార్యకు ప్రియుడితో పెళ్లి చేసిన భర్త….

అనంతరం లోక్ సభ పక్షనేత నామానాగేశ్వర్ రావు మాట్లాడారు. ఒకప్పుడు కాలుష్యరహితంగా ఉండే ఢిల్లీ ఇవాళ కాలుష్య ఖార్ఖానాగా మారిపోయిందని మండిపడ్డారు. కాలాలతో సంబంధం లేకుండా కాలుష్యం ప్రజల్ని పీల్చిపిప్పిచేస్తుందని, మనం చూస్తుండగానే ఢిల్లీలోకి ఆక్సిజన్ సెంటర్స్ వచ్చాయన్నారు. ఈ కాలుష్యం ఇలాగే పెరుగుతూ పోతే.. భవిష్యత్ తరాల పరిస్థితి ఊహించుకుంటేనే భయానకంగా ఉంటుందన్నారు.

మరో ఎంపి దామోదర్ రావు మాట్లాడారు. మనం ఎప్పుడో మేలుకొని చేయాల్సిన కార్యాన్ని ప్రస్తుతం జోగినిపల్లి సంతోష్ కుమార్  తన భుజాలమీద వేసుకున్నారని ప్రశంసించారు. దేశమంతా మొక్కలు నాటిస్తున్నారని, మనిషి శాశ్వతం కాదు అని కానీ భవిష్యత్ తరాల బాగుకోసం చేసే ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు ప్రజల హృదయంలో పదిలంగా ఉంటాయని కొనియాడారు. ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతున్న సహచర సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ కు బిఆర్ఎస్ ఎంపిలందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు దామోదర్ రావు తెలిపారు.

అనంతరం రాజ్యసభ సభ్యులు కె.ఆర్.సురేష్ రెడ్డి మాట్లాడారు. కాలుష్యంతో తల్లడిల్లుతున్న ఢిల్లీలో కెటిఆర్ జన్మదినం సందర్భంగా మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రజలంతా తమ బాధ్యతగా “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” లో పాల్గొని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. జోగినిపల్లి సంతోష్ కుమార్ చేస్తున్న హరిత యజ్ఞంలో పాల్గొనాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో  రాజ్యసభ సభ్యులు కె. కేశవరావు, సంతోష్ కుమార్, లోక్ సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు, దామోదర్ రావు, కె.ఆర్. సురేష్ రెడ్డి, పార్థసారధి రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర, లోక్ సభ సభ్యులు రంజిత్ రెడ్డి, బిబి పాటిల్, రాములు, మన్నె శ్రీనివాస్ రెడ్డి, “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ఫౌండర్ మెంబర్ రాఘవ, కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News