Monday, April 29, 2024

మలక్‌పేటలో భారీ ఐటి పార్కుకు మంత్రి కెటిఆర్ శంకుస్థాపన..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలోని మలక్‌పేటలో భారీ ఐటి పార్కుకు సోమవారం ఉదయం ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు శంకుస్థాపన చేశారు. అనంతరం ఐటి పార్కు భవన నమూనాను మంత్రి కెటిఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపి అసదుద్దీన్, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

పది ఎకరాల విస్తీర్ణంలో 21 అంతస్తులతో 20 లక్షల చదరపు అడుగుల్లో భారీస్థాయిలో ఐటీ టవర్ ను ప్రభుత్వం ఏర్పాటు‌ చేయనుంది. దీంతో దాదాపు 50 వేల మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News