Sunday, April 28, 2024

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నేతలతో కెటిఆర్ భేటీ

- Advertisement -
- Advertisement -

లోక్‌సభ ఎన్నికలు, ఎంఎల్‌సి ఉపఎన్నికపై చర్చ

మనతెలంగాణ/హైదరాబాద్ : రానున్న ఎన్నికలకు సంబంధించిన కార్యాచరణపైన చర్చించడానికి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నేతలతో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సోమవారం తెలంగాణ భవన్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రానున్న లోక్‌సభ ఎన్నికలు, ఎంఎల్‌సి ఉపఎన్నికపైన పార్టీలతో చర్చించారు. ఇప్పటికే ఒక స్థానిక సంస్థల ఎంఎల్‌సి నోటిఫికేషన్ విడుదల కాగా, సోమవారం నుంచి నామినేషన్లు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ ఎన్నికపైన చేపట్టాల్సిన కార్యాచరణపైన, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ స్థానంతో పాటు నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానంలో అనుసరించాల్సిన వ్యూహాలపైన చర్చించారు.

ఒకటి రెండు రోజుల్లోనే ఈ రెండు పార్లమెంట్ నియోజకవర్గాల పైన పార్టీ అధినేత కెసిఆర్ ఒక విస్తృతస్థాయి సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కెటిఆర్ తెలిపారు. ఎంఎల్‌సితో పాటు లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన పరిస్ధితులను కెసిఆర్‌కు విజ్ఞప్తి చేస్తామని ఈ సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఎంఎల్‌సి ఎన్నికలతో పాటు ఈ రెండు లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ విజయ అవకాశాలు బలంగా ఉన్నాయని నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.

KTR 2

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News