Saturday, May 4, 2024

కెసిఆర్ రాకతో కామారెడ్డి కి కలిసొచ్చింది: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి : రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ రానున్న సాధారణ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్న నేపథ్యంలో కామారెడ్డికి కలిసొచ్చిందని దీంతో అందరి దృష్టి కామారెడ్డి పైనే ఉందని, ప్రజలు ఇచ్చే తీర్పుతో ప్రతిపక్ష పార్టీలకు దిమ్మతిరిగిపోతుందని రాష్ట్ర ఐటి పరిశ్రమలశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఆయన శనివారం కామారెడ్డి కి ప్రత్యేక హెక్యాప్టర్‌లో చేరుకోగానే జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి,ప్రభుత్వ విప్ గంపగోవర్దన్ స్వాగతం పలికారు. పట్టణంలో 8 కోట్ల వ్యయంతో నూతన హంగులతో నిర్మించనున్న ఇండోర్ స్టేడియానికి భూమి పూజ చేశారు. అనంతరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బిఆర్‌ఎస్ కార్యకర్త ల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగిచారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తు బిఆర్‌ఎస్ అధినేత సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారంటే అందుకు బలమైన కారణం ఉంటుందన్నారు. కామారెడ్డి కి కేసీఆర్ అవినాభావ సంభందం ఉందని గతంలో జరిగిన సంఘటనను గుర్తు చేశారు.

మా నాయన్నమ్మ స్వగ్రామం ప్రస్థుత బీబీపేట మండలంలోని పోసాన్‌పల్లి గ్రామమని అప్పర్ మానేరు నిర్మాణంతో తమ కుటుంబం చింతమడకలో స్థిరపడ్డ విషయాన్ని గుర్తు చేశారు. అందుకే అక్కడ మా నాయన్నమ పేరుమీద పాఠశాల నిర్మించామని అన్నారు.తెలంగాణ రాష్ట్ర సమిది ఏర్పాటు సమయంలో జలదృశ్యంలో జరిగిన కార్యాక్రమాలకు స్థానిక అడ్వకేట్ తిర్మల్‌రెడ్డి నేతృత్వంలో కొందరు టిఆర్‌ఎస్‌కు మద్దత్తు పలికి తెలంగాణ ఉద్యమంలో కామారెడ్డిని ఉద్యమాల గడ్డగా మార్చారని,ఉద్యమంలో బాగంగా చేపట్టిన ప్రతి కార్యక్రమానికి కామారెడ్డి ప్రజలు అండగా నిలిచారని అన్నారు. కామారెడ్డిలో చేపట్టిన శ్రమదాన కార్యక్రమంలో కెసిఆర్ పాల్గొన్న విషయాన్ని గుర్తు చేశారు. ఉద్యమ సమయంలో జిల్లా పరిషత్ ఎన్నికల సమయంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జిల్లా పరిషత్‌పై గులాబి జెండాను ఎగురవేసిన ఘనత కామారెడ్డి ప్రజలకు దక్కుతుందన్నారు. 2004లో కాంగ్రెస్ తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా ఉంటామని చేసిన ప్రకటనతో వారితో పొత్తుపెట్టుకున్నామని పొత్తు ధర్మంలో బాగంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన షబ్బీర్ అలీకి అవకాశం ఇవ్వడంతోనే ఆయన మంత్రి అయ్యాడని ఆ సమయంలో తన సీటుకోసం కెసిఆర్‌ను బతిమిలాడిన నేత నేడు గత విషయాలను మరిచి కెసిఆర్ ను విమర్శించడం సిగ్గుచేటని అన్నారు.

2011,12 లో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తుతున్న తరుణంలో టిడిపి నుంచి గెలుపొందిన గంపగోవర్దన్ తెలంగాణ కోసం రాజీనామా చేసి టిఆర్‌ఎస్ తో భాగస్వామ్యం అయ్యారని ఆయన రాక ఉద్యమానికి మరింత ఉత్యహాన్ని నింపిందన్నారు. కొందరు పదువుల కోసం వెంపర్లాడే ప్రస్థుత తరుణంలో కామారెడ్డిలో సిఎం కెసిఆర్ ను పోటీ చేయాలని గంపగోవర్దన్ తీసుకున్న నిర్ణయం అభినందనీయమన్నారు. మీరు  ఎంఎల్ఎ గా పోటీ చేయకుండా ఏమి చేస్తారని తాను అడుగుతే కార్యకర్తగా పని చేస్తానని గంపగొవర్ధన్ యొక్క గొప్పతనాన్ని ఈ సందర్భంగా అభినందించారు. జాతీయ పార్టీలకు బిఆర్‌ఎస్ పార్టీ తోక పార్టీ కాదని తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడే పార్టని అన్నారు.డిల్లీ,గుజరాత్ నేతలకు మనం గులాములం కావద్దని మన నిర్ణయాలు మనం తీసుకునే స్వేచ్చ ఉండాలంటే బిఆర్‌ఎస్‌తోనే సాధ్యమవుతుందని అన్నారు. నోటు ఓటు కేసులో ఇరుకున్న కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేవంత్‌రెడ్డి బిజేపికి తెరచాటు నుండి సహాయం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నుండి పది నుంచి ఇరువై స్థానాలు గెలుస్తే వారితో కలసి బిజెపిలోకి జంప్ అయిపోవడం ఖాయమని జోష్యం చెప్పారు. తలకు మించిన వాగ్దానాలతో నేడు కర్ణాటకలో కాంగ్రేస్ పార్టీ ఉక్కిరిబిరిక్కిరి అవుతునే తెలంగాణ ఎన్నికల ఖర్చు కోసం ఉప ముఖ్యమంత్రి శివకుమార్ కమీషన్ల పేరుతో వసూలు చేస్తున్నారని ఆరోపించారు.

కాంగ్రెస్ గ్యారంటీ ఆరు పథకాలంటూ ఊదరగొడుతున్నారని గతంలో ఏం చేశారో గుర్తు చేసుకోవాలన్నారు. బిజెపి అభ్యర్థి కెసిఆర్ తో పోటీ చేయడం కరెక్ట్ కాదని ముందె ఒప్పుకున్నాడని అన్నారు.దక్షణ భారత దేశంలో కెసిఆర్ గెలుపు చరిత్ర సృష్టించబో తున్నారని ఆయన తెలిపారు. న్నికల్లో అనుసరించాల్సిన వ్యుహాలపై కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. వంద మంది ఓటర్లకు ఒక నాయకుడు ఇంచార్జి చేసుకోవాలని చిన్నాపెద్ద నాయకులు కాకుండా అందరు సమానంగా పూర్తి స్థాయిలో పని చేయాలని ప్రతి గ్రామంలోని బిఆర్‌ఎస్ నాయకుల గ్రామాలలో మెజారిటీ వచ్చేందుకు పని చేయాలని సూచించారు. కామారెడ్డి నియోజకవర్గానికి తనతో పాటు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, గంపగోవర్దన్ నిరంతరం పర్యవేక్షణ కొనసాగు తుందని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి సంక్షేమ పథకాల ఫలాలను అనుభవిస్తున్న ప్రతి కుటుంబానికి కలసి సీఎం కేసీఆర్ ఉత్తరాన్ని వారికి అందించి వారి యొక్క ఆశీశు లు తీసుకోవాలని సూచించారు. దేశంలో ఎక్కడా లేని విదంగా బీడీ కార్మికులకు పెన్షన్లు ఇక్కడ ఇస్తున్నామని అన్నారు.

రైతుబంధు,రైతుభీమా,ఆసరా పించన్లు, షాదిముబారక్, కళ్యాణలక్ష్మీ, కేసీఆర్ కిట్,కేసీఆర్ న్యూట్రీషియన్ కిట్లు, డబుల్ బెడ్‌రూంలు లబ్దిదారులను పతి కార్యకర్త కలవాలని సూచించారు. తెలంగాణ ఉద్యమంలో అమెరికాకు పారిపోయిన కిషన్‌రెడ్డి నోటుకు ఓటు కేసులో ఇరుక్కుపో యి ఉద్యమకారులపై గన్ను పట్టుకున్న రేవంత్‌రెడ్డిలు తెలంగాణ ప్రజలకు ఏం చేస్తారని ప్రశ్నించారు. కామారెడ్డి నియోజకవర్గంలో 266 బూత్ కమిటీలు సమిష్టి గా పనిచేసి కార్యకర్తలే కథానాయకులుగా కావాలని పిలునిచ్చారు. కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపి బీబీ పాటిల్, ప్రభుత్వ విప్ గంపగోవవర్దన్, ముజీబుద్దిన్,తిర్మల్‌రెడ్డి,మున్సిపల్ చైర్ పర్సన్, వివిద మండలాల ఎంపిపిలు, జడ్పిటిసీలు, బిఆర్‌ఎస్ పార్టీ అద్యక్ష కార్యదర్శులు,గ్రామ అద్యక్షులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News