Monday, June 30, 2025

ఇక్కడ బిజెపికి అధికారం కల్ల

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ పెద్దలకు రేవంత్ సర్కార్ ఎటిఎంలా
మారిందంటూనే విచారణ ఎందుకు జరపరు?
ఒక్క పసుపు బోర్డును ఎన్నిసార్లు
ప్రారంభిస్తారు? అమిత్ షాకు కెటిఆర్ కౌంటర్

మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్రంలో అధి కారంలోకి వచ్చిన క్షణం నుంచి నేటి వరకు అడు గడుగునా ఈ ప్రాంత ప్రజల గొంతు కోస్తున్న పచ్చి తెలంగాణ వ్యతిరేకి బిజెపి రాష్ట్రంలో ఎప్ప టికీ అధికారంలోకి రాదని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో రేవంత్ సర్కార్‌పై అవినీతి ఆరోపణలు చేస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా… సిబిఐ, ఇడిలతో వెంట నే విచారణ జరపించాలని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ డిమాండ్ చేశారు. ఆర్.ఆర్. టాక్స్ పేరిట రాహుల్- రేవంత్ కలిసి తెలంగాణను దోచుకుంటున్నారని గతంలో ఆరోపించిన ప్రధాని మో డీ, ఇప్పటి వరకు దర్యాప్తుకు ఆదేశించక పోవడానికి కారణమేంటో చెప్పాలన్నారు. దేశ ప్రధాని హోదాలో మోదీ, కేంద్ర హోంమంత్రిగా అమిత్ షా తెలంగాణకు వచ్చి సిఎంపై కేవలం అవినీతి ఆరోపణలు చేస్తే సరిపోతుందా? అని ప్రశ్నించారు.

పట్టపగలు ప్రజాధనం లూటీ చేస్తూ ఢిల్లీకి మూ టలు పంపుతున్న కాంగ్రెస్ సిఎం అ క్రమాలకు కేంద్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేయదా..? అని నిలదీశారు. ఢిల్లీలో కాంగ్రెస్‌తో బిజెపి కుస్తీ, తెలంగాణ లో మాత్రం దోస్తీ అన్నట్టుగా సాగు తున్న కుమ్మక్క రాజకీయాలతోనే రేవంత్‌ను బిజెపి పెద్దలు వెనకేసుకొస్తున్నారని ఒక ప్రకటనలో ఆరోపించారు. ఢిల్లీ కాంగ్రెస్‌పార్టీ పెద్దలకు తెలంగాణలోని రేవం త్ సర్కార్ ఎటిఎంలా మారిపోయిందని నిజామాబాద్ గడ్డపై తేల్చిచెప్పిన అమిత్ షా, కేంద్ర హోం మంత్రి హోదాలో విచారణకు ఆదేశించి నిజాయితీ నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.లేకుంటే బిఆర్‌ఎస్‌ను ఒంటరిగా ఎదుర్కోలేకనే రేవంత్‌ను పావుగా వాడుకుంటున్నారన్న ఆరోపణల్లో నిజం ఉందనుకోవాల్సి వస్తుందని అన్నారు.

కాళేశ్వరంపై బురదజల్లడమే పని
ధాన్యం దిగుబడిలో పంజాబ్‌నే తలదన్ని దేశంలోనే నంబర్ వన్ స్థానానికి తెలంగాణ ఎదగడం లో కీలకపాత్ర పోషించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై అమిత్ షా బురదజల్లడం అత్యంత దురదృష్టకరం అని కెటిఆర్ పేర్కొన్నారు. ఎనిమిది మంది ఎంపిలను గెలిపించినా, ఇద్దరు కేంద్రమంత్రులు ఉన్నా, తెలంగాణలోని ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకుండా, కనీసం ఒక్క ఐఐటీ, ఐఐఎం, మెడికల్ కాలేజీ వంటి ఉన్నత విద్యాసంస్థలు మంజూ రు చేయకుండా బిజెపి చేస్తున్న అన్యాయాన్ని నా లుగు కోట్ల ప్రజలు నిత్యం గమనిస్తూనే ఉంటారని చెప్పారు. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో పసుపు బోర్డు కు నిధులు కేటాయించకుండా.. పసుపు బోర్డు ఆఫీసుకు రిబ్బన్ కట్ చేస్తే న

యాపైసా ప్రయోజనం ఉండదని విమర్శించారు. పసుపు బోర్డు కా ర్యాలయానికి సొంత భవనం నిర్మించకుండా కెసిఆర్ ప్రభుత్వం నిర్మించిన ఎంఎల్‌ఎ క్యాంపు కా ర్యాలయంలోనే ఆఫీసును ప్రారంభించడం సమంజసమేనా..? అని ప్రశ్నించారు. అసలు ఒక్క పసు పు బోర్డును ఇన్నిసార్లు ప్రారంభించడం అతిపెద్ద జోక్ అంటూ ఎద్దేవా చేశారు. పసుపు బోర్డు కార్యలయాన్ని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు హోటల్ ఏర్పాటు చేస్తున్నామని ఈ జనవరి 14న కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్ ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభిస్తే, ఇవాళ పసుపు బోర్డు కార్యాలయాన్ని మరోసారి అమిత్ షా ప్రారంభించడం బిజెపి చేసే జుమ్లా పనులకు, చెప్పే జూఠా మాటలకు నిదర్శనం అని కెటిఆర్ విమర్శించారు.

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసింది
నదుల అనుసంధానం ముసుగులో ఎపిలోని టిడిపి ప్రభుత్వం చేపట్టిన బనకచర్లకు కేంద్రం బంగారు బాటలు వేయడం గోదావరిపై తెలంగాణ రైతుల హక్కులను కాలరాయడమే అని కెటిఆర్ మండిపడ్డారు. విభజన చట్టం ప్రకారం అడవిబిడ్డలకు ఉపాధి కల్పించే బయ్యారం ఉక్కు కర్మాగారానికి పాతరేసి, హైదరాబాద్ రూపురేఖలు మార్చే ఐటిఐఆర్ ప్రాజెక్టును కూడా రద్దు చేసి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ద్రో హం చేసిందన్నారు. పేరుకు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని నిర్మిస్తున్నా, నిర్వహణ బాధ్యతలు ప్రైవేటుకే అప్పగించే ప్రయత్నాలకు స్వస్తిపలికి వరంగల్ యువత ఉపాధికి భరోసా ఇవ్వాలని కెటిఆర్ విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News