Monday, April 29, 2024

జల్.. జంగల్.. జమీన్… కుమ్రం భీం కలలు సాకారం…

- Advertisement -
- Advertisement -

అసిఫాబాద్: శుక్రవారం  1.51 లక్షల మంది గిరిజనులకు 4.60 లక్షల ఎకరాల పోడు భూముల పట్టాలను సిఎం కెసిఆర్ పంపిణీ చేస్తున్న సందర్భంగా మంత్రి కెటిఆర్ తన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.

నీళ్ళు..
నిధులు..
నియామకాలు..
అనే ఉద్యమ నినాదాలనే కాదు..

జల్..
జంగల్..
జమీన్…
అనే కుమ్రం భీం కలలను కూడా..

అక్షరాలా..
సాకారం చేసిన..
ధీరోదాత్తమైన నాయకుడు..
మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు…

మొన్న
కొండకోనల్లోని నివాసాలకు
మిషన్ భగీరథతో స్వచ్ఛమైన “జల్”

నిన్న
కంటికి రెప్పలా కాపాడటంతో..
రాష్ట్రంలో 7.70 శాతం పెరిగిన “జంగల్”

నేడు
1.51 లక్షల మందికి
ఏకంగా 4.60 లక్షల ఎకరాల “జమీన్”

” మావ నాటే – మావ రాజ్ ” స్వప్నం
గ్రామ పంచాయితీల ఏర్పాటుతో సాకారం

పది శాతానికి పెరిగిన రిజర్వేషన్లతో
గిరిజన బిడ్డల్లో ఆకాశాన్నంటే ఆత్మ విశ్వాసం

ఇలా
ఒకటా.. రెండా…
పోడు భూముల గోడు తీర్చి..
గిరిజన – ఆదివాసీల ఆశలన్నీ నెరవేర్చి..
పట్టాలతో.. పట్టాభిషేకం చేస్తున్న తరుణం..
అడవిబిడ్డల అభ్యున్నతిలోనే ఓ సువర్ణ అధ్యాయం..

జై కుమ్రంభీం
జై తెలంగాణ

జై జై తెలంగాణ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News